twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ మాటలు నమ్మను.. చిరంజీవిని కంగారు పెట్టిన సైరా రిజల్ట్

    |

    సినిమా పరిశ్రమలో ఎంతటి సూపర్‌స్టార్ అయినప్పటికీ.. తన సినిమా రిలీజ్ అయిందంటే పరీక్ష రాసిన పిల్లాడిలా మారిపోతుంటారు. తన సినిమాకు సంబంధించిన రిపోర్టును తెలుసుకోవాలనే ఆలోచన రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితే చిరంజీవికి ఎదురైంది. సైరా రిలీజ్‌ రోజున తాను ఎంత టెన్షన్‌ను అనుభవించాననే విషయాన్ని తాజాగా పాత్రికేయులతో పంచుకొన్నారు. చిరంజీవిని కంగారు పెట్టిన క్షణాలు ఎలాంటివంటే..

     ప్రతీ సినిమా మాదిరిగానే

    ప్రతీ సినిమా మాదిరిగానే

    ప్రతీ సినిమా రిలీజ్ రోజున నాకు నాలుగైదు కాల్స్ ఉదయం నాలుగు గంటలకే వస్తాయి. సైరా సినిమా రిలీజ్ రోజున అలాంటి కాల్స్ కోసం ఎదురుచూస్తున్నాను. కానీ ఎలాంటి కాల్ రాకపోయే సరికి కంగారు మొదలైంది. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కాల్ చేసి.. ఫస్టాఫ్ చూశాను. సూపర్ అంటూ చెప్పాడు. సెకండాఫ్ చూసి చెబుతానన్నాడు. అయినా 5 తర్వాత కూడా కాల్ రాకపోవడం నాలో కంగారు తగ్గలేదు అని చిరంజీవి పేర్కొన్నారు.

    అమెరికా, కెనడా, సీడెడ్ నుంచి

    అమెరికా, కెనడా, సీడెడ్ నుంచి

    అమెరికా, కెనడా నుంచి నా ఫ్రెండ్స్ చేస్తారు. వాళ్లు చేయలేదు. ఇక సీడెడ్ నుంచి ఎన్వీ ప్రసాద్ చేస్తారు. అతను చేయలేదు. ఇలా ఎవరూ చేయకపోవడంతో సెకాండఫ్ చూసి షాక్ తిన్నారా అనే అనుమానం వచ్చింది. దాంతో నాలో టెన్షన్ పెరిగిపోయింది. ఎవరు చూస్తారా అని ఎదురు చూస్తుంటే అల్లు అర్జున్ వాయిస్ మెసేజ్ వచ్చింది.

    అల్లు అర్జున్ వాయిస్ మెసేజ్

    అల్లు అర్జున్ వాయిస్ మెసేజ్

    ఇక చాలా సేపటికి అల్లు అర్జున్ నుంచి ఫోన్ వాయిస్ కాల్ వచ్చింది. కృష్ణా జిల్లాలో నిర్మాత బన్నీ వాసు సినిమా చూశాడు. సూపర్బ్ రిపోర్టు.. బ్లాక్‌బస్టర్ అంటూ చెప్పిన బన్నీ మాటలు నమ్మలేదు. ఎందుకంటే నాకు మన ఇంట్లో వాళ్లు మంచిగా ఉందని చెప్పడం సహజంగాను ఉంటుందిగా అని లైట్ తీసుకొన్నాను. దాంతో మరింత టెన్షన్ పెరిగింది.

    ఉదయం 5 గంటలప్రాంతంలో

    ఉదయం 5 గంటలప్రాంతంలో

    సుమారు 5 గంటల ప్రాంతంలో చాలా కాల్స్, మెసేజెస్ రావడం ప్రారంభమయ్యాయి. అంతలోనే నా ఫ్రెండ్ అమెరికా నుంచి కాల్ చేశాడు. అప్పుడు ఏంది ఇంత లేటు అని అడిగితే.. ఫస్ట్ షోకు టికెట్ దొరకలేదు. అన్ని షోలు హౌస్‌ఫుల్.. అందుకే రెండో షో చూశాను అంటూ తన కష్టాలు చెప్పారు. అలా ఓ గంట గడిచే సరికి సమగ్రంగా రిపోర్ట్ రావడంతో నాకు మనసు తేలికపడింది అని చిరంజీవి చెప్పారు.

    English summary
    Paruchuri Gopalakrishna Revealed Fact for Not Attending Sye Raa Pre Release Event. Because If Illness He Didnot Attend This event. His Brother Paruchuri Venkateshwara Rao Wants To Get Oscar Award. Movie Produced By Ram Charan And directed By Surender Reddy. This Movie Releasing On 2nd October. Recently Chiranjeevi shared a news about his tension about the sye raa result.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X