Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెద్దదైన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం: ఏడాది కాలంలోనే ఇంత మంది వచ్చేశారు
తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. దాదాపు నలభై ఏళ్లుగా పరిశ్రమలో తన హవాను చూపిస్తోన్న ఆయన.. వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు. రాజకీయాల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ మెగా హీరో.. కొన్నేళ్ల క్రితం 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి తన పంథాను మార్చుకుని.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని చిత్రాలను లైన్లో పెట్టుకుంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 2020 మార్చిలో ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో అంశాలపై ఆయన స్పందిస్తూ అందులో పోస్టులు పెడుతున్నారు. అదే సమయంలో తన సినీ కెరీర్కు సంబంధించిన అంశాలను కూడా ఫ్యాన్స్కు వెల్లడిస్తున్నారు. అలాగే మూవీ అప్డేట్లు కూడా దీని ద్వారా ఇస్తున్నారు. దీంతో ట్విట్టర్లో చిరంజీవిని ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఒక మిలియన్ ఫాలోవర్ల (పది లక్షల మంది) మార్కును చేరుకున్నారు. చాలా తక్కువ సమయంలోనే ఈ మైలురాయిని చేరుకున్న సీనియర్ హీరోగా నిలిచారాయన.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. దీనితో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో 'లూసీఫర్' రీమేక్ను సైతం అధికారికంగా ప్రారంభించారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది. వీటి తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం' రీమేక్ చేయనున్నారు. అనంతరం కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారాయన.