Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
మెగాస్టార్ షాకింగ్ డిసీజన్.. వెంటనే మార్పులు చేయండి అంటూ ఆర్డర్!
మెగాస్టార్ చిరంజీవిలో ప్రధాన ఆకర్షణ ఆయన డాన్సులే. చిరు స్టెప్పులేశాడంటే థియేటర్లన్నీ హోరెత్తి పోవాల్సిందే. దశాబ్దాల కాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కేవలం వెండితెరపై మెగాస్టార్ స్టెప్పులు చూడాలని వెళ్లేవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆ సినిమా లోనూ డాన్సులతో దుమ్ముదులిపేశారు. అయితే తాజా సమాచారం మేరకు ఆయన కొత్త సినిమా 'సైరా నరసింహా రెడ్డి' లో ఒక్క స్టెప్పు కూడా ఉండదని తెలుస్తోంది.
తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు యూనిట్ సభ్యులు. అయితే హిస్టారికల్ సినిమా కాబట్టి 'సైరా'లో డాన్సులకు పెద్దగా స్కోప్ ఇవ్వకూడదని చిరు భావిస్తున్నారట. ఈ మేరకు డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఈ విషయమై డిస్కస్ చేసిన చిరు.. తనకు సంబందించిన డాన్సుల తాలూకు సీన్స్ తొలగించమని చెప్పారట. దీంతో ప్రస్తుతం అదే పనిలో నిమగ్నమై ఉందట చిత్రయూనిట్. ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్ లో ఈ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. తన నటనలో ఎంతో ప్రధాన ఆకర్షణ అయిన డాన్సులనే పక్కన పెట్టేశారంటే 'సైరా'లో ఏ రేంజ్లో సన్నివేశాలు ఉంటాయో అర్థం చేసుకుపోవచ్చు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో 'సైరా నరసింహా రెడ్డి' మూవీ తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయన తార హీరోయిన్గా నటిస్తోంది. మిల్క్ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు లాంటి భారీ తారాగణం పాలు పంచుకుంటోంది.