Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Acharya: చిరంజీవి పేరిట అరుదైన రికార్డు.. ఆయన కెరీర్లోనే తొలిసారి అన్ని కోట్లకు డీల్
సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి.. ఒకదాని తర్వాత ఒకటి ఇలా పలు చిత్రాలను చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఆయన.. ఫ్యాన్స్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నారు. ఇక, ప్రస్తుతం ఈ సీనియర్ హీరో 'ఆచార్య' అనే సినిమాలో నటిస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే.
బట్టలు లేకుండా దిగిన ఫొటో వదిలిన శృతి హాసన్: ఆ ప్లేస్లో టాటూ.. ఎవరి పేరు ఉందో తెలిస్తే!
మెగా మల్టీస్టారర్గా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీ షూటింగ్ చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అంతలో సెకెండ్ వేవ్ రావడంతో మళ్లీ చిత్రీకరణకు బ్రేక్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే బ్యాలన్స్ పార్ట్ కోసం చిత్రీకరణను పున: ప్రారంభించారు. ఆ వెంటనే దాన్ని కూడా కంప్లీట్ చేసేసి.. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తైందని అధికారికంగా ప్రకటించారు. అయితే, కొన్ని పాటలు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయని వెల్లడించారు.
ఇటీవలే 'ఆచార్య' పాటలకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. ఆరంభంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇలా కొద్ది రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఇక, చిరంజీవి 'ఆచార్య' టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేసుకున్నారని ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు, ఆ వెంటనే ఆయన డబ్బింగ్ను కూడా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కూడా వినిపించింది. అయితే, రామ్ చరణ్ మాత్రం తన పార్ట్ను కొంత మేరకు చేయాల్సి ఉందని తెలుస్తోంది. అది కూడా అయిపోతే చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.
బీచ్లో లవర్తో పాయల్ రాజ్పుత్ రచ్చ: బికినీలో అందాలన్నీ చూపిస్తూ.. షాకిస్తోన్న సెల్ఫీ వీడియో
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కుల కోసం చాలా సంస్థలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని ఏరియాల్లో రికార్డు స్థాయి బిజినెస్ కూడా జరిగింది. ఇక, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. 'ఆచార్య' ఈస్ట్ గోదావరి హక్కులను ఓం మణికంఠ, శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ సంస్థలు సంయుక్తంగా సొంతం చేసుకున్నాయట. ఇందులో ఈ రెండు సంస్థలు కలిపి ఏకంగా రూ. 9 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్లో ఆ ఏరియాలో ఇవే బెస్ట్ మార్కెట్ అన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.
క్రేజీ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో రాబోతున్న 'ఆచార్య' కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మెగా మల్టీస్టారర్గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.