Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరంజీవి విషయంలో వస్తున్న ఆ వార్తలపై క్లారిటీ.. అధికారికంగా ప్రకటించనున్న చరణ్.!
చాలా గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా అనుకున్న దాని కంటే మంచి రిజల్ట్ను రాబట్టింది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో వసూలు చేసింది. దీంతో ఆయన కమ్బ్యాక్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో చిరంజీవి వరుసగా ప్రాజెక్టులను ఓకే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'సైరా: నరసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది పట్టాలపై ఉండగానే మరో మూవీకి సంతకం చేసేశారు. తాజాగా ఆయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన ప్రకటనను కూడా రామ్ చరణ్ చేయనున్నారని అంటున్నారు. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే...
తండ్రికి గిఫ్ట్ ఇద్దామనుకుంటే తేడా కొట్టింది
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి'. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని రామ్ చరణ్ స్వయంగా నిర్మించాడు. మాంచి హిట్ కొట్టి తన తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా రూపొందించాడు. అయితే, ఈ సినిమా మాత్రం అనుకున్నంతగా ఆడలేదు. ఫలితంగా నష్టాలు వచ్చాయి.
ఒకటి పోతే ఇంకొకటి.. చరణ్ ప్లాన్ ఇదే
చిరు ఈ మధ్య చేసిన రెండు సినిమాలనూ రామ్ చరణే నిర్మించాడు. ఇందులో ‘సైరా' బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఈ నేపథ్యంలో తన తండ్రితో మరో సినిమాను ప్లాన్ చేశాడు చరణ్. బడా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే ముగిశాయి. జనవరి మొదటి వారంలో రెగ్యూలర్ షూట్ ప్రారంభం కానుంది.
ఎవరూ టచ్ చేయని సబ్జెక్టును పట్టాడు
కొరటాల శివ సినిమాలు అంటే మెసేజ్ ఓరియెంటెడ్గా తెరకెక్కుతుంటాయి. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ అదే జోనర్లా వచ్చాయి. ఇప్పుడు చిరంజీవితో చేసే మూవీ కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. దేవాదాయ భూములను కబ్జాదారులు ఆక్రమించుకోవడం వల్ల ప్రభుత్వాలకు ఎంత నష్టం వస్తుందో ఇందులో చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాతో చిరంజీవి ఖాతాలో రికార్డు
ఈ సినిమాకు మొదట ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ పెడుతున్నట్లు చెప్పారు. కానీ, ఇటీవల ఈ సినిమా పేరును ‘గోవిందా హరి గోవిందా' అని మార్చారని అంటున్నారు. ఇందులో చిరు రెండు రోల్స్ చేస్తున్నారని టాక్. అందుకోసమే రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకుంటున్నారట. మొత్తంగా ఈ సినిమాకు ఆయన రూ. 50 కోట్లు వరకు చార్జ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
సినిమా ఒక్క భాషలో కాదు.. రిలీజ్ లేట్
ఈ సినిమా ప్రారంభం కాకముందే ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారని, అందుకోసం బాలీవుడ్ నిర్మాణ సంస్థ చరణ్తో సంప్రదింపులు జరిపిందని అన్నారు. అలాగే, ఈ సినిమా విడుదల తేదీని కూడా మారుస్తున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ మూవీ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అధికారికంగా ప్రకటించనున్న చరణ్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టు గురించి రామ్ చరణ్ త్వరలోనే ప్రెస్మీట్ పెట్టబోతున్నాడని తాజా సమాచారం. అందరూ అనుకుంటున్నట్లు ఈ మూవీని తెరకెక్కించడం లేదట. కేవలం తెలుగులో మాత్రమే రూపొందిస్తారని సమాచారం. అలాగే, నటీనటులు ఇతరత్రా విషయాలను ఆ ప్రెస్మీట్లో వివరించబోతున్నాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.