Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
కరోనా ఎఫెక్ట్.. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చేలా.. రక్తదానం చేసిన మెగాస్టార్
కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 23 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అందులో లక్షకు పైగా దుర్మరణం చెందారు. ఇక మనదేశంలోనూ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పదిహేను వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు వందలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా కట్టడికి మన దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నా.. కరోనాపై పోరాడేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని ప్రపంచ దేశాలు కూడా నొక్కి చెబుతున్నాయి.
కఠినతరంగా లాక్ డౌన్..
మన దేశంలో రెండో విడత లాక్ డౌన్ నడుస్తోంది. మొదటగా 21 రోజుల పాటు విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14న ముగిసింది. కరోనా వైరస్ తీవ్రత ఇంకా పెరగడంతో మరో 19 రోజులు మే 3 వరకు లాక్ డౌన్ను పొడిగించారు. అయితే లాక్ డౌన్ వల్ల ఎంతోమంది ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది.
రక్తం నిల్వలు కూడా..
అయితే లాక్ డౌన్ విధించడం వల్ల రక్తం నిల్వలు తగ్గిపోయాయి. రాష్ట్రంలోని అన్ని బ్లడ్ బ్యాంక్లో రక్తం లేదని తెలుస్తోంది. ప్రజలెవరూ బయటకు రాకపోవడం, అందరూ ఇంటి పట్టునే ఉండాలనే ఆదేశాలుండటంతో రక్తం ధానం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
తలసేమియా వ్యాధిగ్రస్తులకు..
అయితే నిత్యం రక్త మార్పిడి చేయాల్సిన రోగుల పరిస్థితి దారుణంగా ఉందని సమాచారం. ముఖ్యంగా చిన్న పిల్లలు, తలసేమియా వ్యాధి గ్రస్తుల పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. రక్తం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తోంది. దాతలు ముందుకు రావాలని, రక్తాన్ని ఇచ్చి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
|
ముందుకు వచ్చిన నాని..
న్యాచురల్ స్టార్ నాని తన వంతుగా వచ్చి రక్తధానం చేసి ప్రజలకు అవగాహన కలిగించారు. బయటకు రండి అంటూ రక్త దానం చేయమని ప్రజలకు పిలుపునిచ్చాడు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు వెళ్లిన నాని అక్కడ రక్తదానం చేశాడు. అనంతరం అభిమానులకు సందేశాన్ని ఇచ్చాడు.
Recommended Video
రక్తదానం చేసిన మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి ముందు నుంచి రక్తదానం, నేత్రదానం గురించి అందరికీ అవగాహన కలిగిస్తూనే ఉన్నాడు. ఇలాంటి విపత్కర సమయంలోనూ మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి.. తన బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశాడు. ఈ మేరకు ఫ్యాన్స్కు కూడా పిలుపునిచ్చాడు.