Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
క్రేజీ కాంబినేషన్ సెట్ చేసిన నితిన్.. తొలిసారి దేవిశ్రీ!
యంగ్ హీరో నితిన్ కొత్త చిత్రానికి సర్వం సిద్ధం అవుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు. దాని కోసం చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. నితిన్ నెక్స్ట్ మూవీ వెంకీ కుడుముల దర్శత్వంలో ఉండబోతున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్ రెడీ అయ్యాక ఈ చిత్రాన్ని లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ చిత్రానికి క్రేజీ కాంబినేషన్ సెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఛలో చిత్రాన్ని వినోదాత్మకంగా మలచి హిట్ అందుకున్నాడు. నితిన్ కోసం రూపొందించిన కథలో కూడా వినోదాత్మక అంశాలు చాలానే ఉన్నాయట. ఈ చిత్రానికి భీష్మ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వివాహానికి దూరంగా ఉన్న ఓ యువకుడి కథని వెంకీ కుడుముల ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
నితిన్ చిత్రానికి తొలిసారి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆడించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రేజీ హీరోయిన్ రష్మిక నితిన్ సరసన రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.