Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా ఆగిపోలేదు.. సాయి పల్లవి, నేను నటిస్తాం.. రానా!
విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు. ప్రస్తుతం రానా కొన్ని బహుభాషా చిత్రాలలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ లో రానా నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా రానా మరో విభిన్నమైన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
నీదీ నాది ఒకే కథ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు ఊడుగుల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు అడుగుల ఆసక్తికరమైన చిత్రానికి ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి విరాటపర్వం 1992అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా మాత్రం ప్రారంభం కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీనిపై తాజాగా రానా స్పందించిన క్లారిటీ ఇచ్చాడు. వేణు ఊడుగుల దర్శత్వంలో చిత్రం ఆగిపోలేదని తెలిపాడు. ఈ చిత్రంలో తాను, సాయి పల్లవి కలసి నటిస్తున్నట్లు రానా క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది.