Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సినిమా ఆగిపోలేదు.. సాయి పల్లవి, నేను నటిస్తాం.. రానా!
విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు. ప్రస్తుతం రానా కొన్ని బహుభాషా చిత్రాలలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ లో రానా నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా రానా మరో విభిన్నమైన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
నీదీ నాది ఒకే కథ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వేణు ఊడుగుల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు అడుగుల ఆసక్తికరమైన చిత్రానికి ప్లాన్ చేశాడు. ఈ చిత్రానికి విరాటపర్వం 1992అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి. కానీ సినిమా మాత్రం ప్రారంభం కాకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీనిపై తాజాగా రానా స్పందించిన క్లారిటీ ఇచ్చాడు. వేణు ఊడుగుల దర్శత్వంలో చిత్రం ఆగిపోలేదని తెలిపాడు. ఈ చిత్రంలో తాను, సాయి పల్లవి కలసి నటిస్తున్నట్లు రానా క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది.