Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వార్డు మెంబర్గా రానా.. ఆసక్తికరంగా విరాటపర్వం 1992!
విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రానా దూసుకుపోతున్నాడు. బాహుబలి, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి లాంటి చిత్రాలలో నటిస్తూ అభిమానులకు ఎప్పటికి గుర్తుండిపోయే పాత్రలు అందిస్తున్నాడు.గత కొంతకాలంగా రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి విరాటపర్వం 1992 అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. ఆ మధ్యం ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో రానా స్పందించాడు.
ఈ చిత్రం ఆగిపోలేదని నేను, సాయిపల్లవి జంటగా నటించబోతున్నాం అని రాజా క్లారిటీ ఇచ్చాడు. నీదీ నాది ఒకే కథ చిత్రంలో వేణు ఊడుగుల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విరాటపర్వం చిత్రంలో రానా పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రానా పంచాయతీ వార్డు మెంబర్గా నటిస్తాడట. వేణు ఈ చిత్ర కథని చాలా ఆసక్తికరంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
రాజా ఇప్పటికే నేనేరాజు నేనే మంత్రి చిత్రంలో రాజకీయనాయకుడిగా నటించాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం కానుంది అనే విషయం త్వరలోనే తెలియనుంది. రానా కోసం దర్శకుడు వేణు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు.