Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అర్జున్ రెడ్డి రీమేక్.. ధృవ్కి తండ్రిగా స్టార్ డైరెక్టర్!
స్టార్ హీరో విక్రమ్ తన తనయుడు ధృవ్ ని ఒక రేంజ్ లో చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని భావించాడు. కానీ ధృవ్ తొలి చిత్రం అనుకున్నంత సాఫీగా జరగడం లేదు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసి ఇంప్రెస్ అయిన విక్రమ్ తన కుమారుడి తొలి చిత్రంగా ఇదే బావుంటుందని భావించాడు. వెంటనే బాల దర్శత్వంలో అర్జున్ రెడ్డి రీమేక్ ప్రారంభించారు. వర్మ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరిగిపోయింది. ట్రైలర్ కూడా విడుదలైంది. కానీ విక్రమ్ కు అవుట్ పుట్ నచ్చకపోవడంతో చిత్రాన్ని రద్దు చేశాడు.
దర్శకుడుని, హీరోయిన్ ని మార్చేసి మళ్ళి కొత్తగా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆదిత్య వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గిరిసాయ దర్శత్వంలో ఆదిత్య వర్మ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ధృవ్ కి తండ్రిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటి బనిత సంధుని ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2020లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. బాల తెరకెక్కించిన చిత్రం రద్దయినప్పుడు స్వయంగా నిర్మాతలే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన చిత్రాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.