Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అర్జున్ రెడ్డి రీమేక్.. ధృవ్కి తండ్రిగా స్టార్ డైరెక్టర్!
స్టార్ హీరో విక్రమ్ తన తనయుడు ధృవ్ ని ఒక రేంజ్ లో చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని భావించాడు. కానీ ధృవ్ తొలి చిత్రం అనుకున్నంత సాఫీగా జరగడం లేదు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసి ఇంప్రెస్ అయిన విక్రమ్ తన కుమారుడి తొలి చిత్రంగా ఇదే బావుంటుందని భావించాడు. వెంటనే బాల దర్శత్వంలో అర్జున్ రెడ్డి రీమేక్ ప్రారంభించారు. వర్మ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరిగిపోయింది. ట్రైలర్ కూడా విడుదలైంది. కానీ విక్రమ్ కు అవుట్ పుట్ నచ్చకపోవడంతో చిత్రాన్ని రద్దు చేశాడు.
దర్శకుడుని, హీరోయిన్ ని మార్చేసి మళ్ళి కొత్తగా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆదిత్య వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గిరిసాయ దర్శత్వంలో ఆదిత్య వర్మ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ధృవ్ కి తండ్రిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటి బనిత సంధుని ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2020లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. బాల తెరకెక్కించిన చిత్రం రద్దయినప్పుడు స్వయంగా నిర్మాతలే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన చిత్రాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.