Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం తెలుగులో రీమేక్.. హీరో ఎవరంటే!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందహై చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ జంటగా నటించిన ఈ యాక్షన్ మూవీ ఘనవిజయం సాధించింది. అలీ అబ్బాస్ ఈ చిత్రానికి దర్శకుడు.ప్రస్తుతం తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ తెలుగు రీమేక్ లో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక కత్రినా కైఫ్ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల గోపీచంద్ కు జోడిగా హాట్ బ్యూటీ జరీన్ ఖాన్ ని అనుకున్నారట. కానీ చివరకు తమన్నాకే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. టైగర్ జిందహై చిత్రం 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర రీమేక్ గురించి వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హీరో గోపీచంద్ కు ఇటీవల సరైన విజయం లేదు. దీనితో గోపించంద్ ఒక మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నా ఏదీ వర్కౌట్ కావడం లేదు. గోపీచంద్ చివరగా నటించిన చిత్రం పంతం గత ఏడాది విడుదలయింది. టైగర్ జిందహై రీమేక్ ఒకే అయితే ఆరంభం నుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడతాయి.