Don't Miss!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం తెలుగులో రీమేక్.. హీరో ఎవరంటే!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందహై చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ జంటగా నటించిన ఈ యాక్షన్ మూవీ ఘనవిజయం సాధించింది. అలీ అబ్బాస్ ఈ చిత్రానికి దర్శకుడు.ప్రస్తుతం తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ తెలుగు రీమేక్ లో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక కత్రినా కైఫ్ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల గోపీచంద్ కు జోడిగా హాట్ బ్యూటీ జరీన్ ఖాన్ ని అనుకున్నారట. కానీ చివరకు తమన్నాకే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. టైగర్ జిందహై చిత్రం 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర రీమేక్ గురించి వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
హీరో గోపీచంద్ కు ఇటీవల సరైన విజయం లేదు. దీనితో గోపించంద్ ఒక మంచి చిత్రం కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నా ఏదీ వర్కౌట్ కావడం లేదు. గోపీచంద్ చివరగా నటించిన చిత్రం పంతం గత ఏడాది విడుదలయింది. టైగర్ జిందహై రీమేక్ ఒకే అయితే ఆరంభం నుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడతాయి.