గోపిచంద్ ఇంట్లో రెట్టింపైన పండుగ కళ.. మగబిడ్డకు జన్మనిచ్చిన రేష్మ!
సినీ హీరో గోపీచంద్ ఇంట పండుగ కళ రెట్టింపైంది. వినాయక చవితి పర్వదినాన గోపీచంద్ సతీమణి రేష్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో గోపించంద్ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. గోపీచంద్ కు ఇది రెండవ సంతానం. ఇప్పటికే గోపిచంద్, రేష్మకు మూడేళ్ళ కుమారుడు విరాట్ ఉన్నాడు.
ఈ తెల్లవారు జామున రేష్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గోపించంద్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వినాయక చవితికి దేవుడిచ్చిన గిఫ్ట్ అంటూ గోపీచంద్ తన సంతోషాన్ని తెలియజేశాడు.

ఇదిలా ఉండగా గోపించంద్ ఇటీవల పంతం చిత్రంతో ఆడియన్స్ ని అలరించాడు. తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతున్నాడు. గోపించంద్, రేష్మ 2013 లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.


Click it and Unblock the Notifications











