Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న నితిన్.. ఆ దర్శకుడితో మళ్ళీ!
యంగ్ హీరో నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇంతవరకు నితిన్ కొత్త చిత్రం ప్రారంభం కాలేదు. త్వరలో ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించబోతున్నాడు. ఈ చిత్రం భీష్మ పేరుతో తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా నితిన్ తన తదుపరి చిత్రాల గురించి కూడా కొందరు దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇదిలా ఉండగా తనకు గుండె జారి గల్లంతయ్యిందే లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కుమార్ కొండతో నితిన్ మరో చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నితిన్ వరుసపరాజయాల్లో ఉన్న సమయంలో అతడి కెరీర్ ని ఇష్క్ చిత్రం నిలబెట్టింది. ఆ చిత్రం తర్వాత నితిన్ విజయ్ కుమార్ దర్శత్వంలో గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నితిన్ లో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఆ తర్వాత నితిన్ కొన్ని హిట్స్, కొన్ని ప్లాప్స్ తో కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు.
ఇటీవల విజయ్ కుమార్ నితిన్ ని కలసి ఓ కథ వినిపించాడట. విజయ్ కుమార్ వినిపించిన కథ చాలా వైవిధ్యంగా ఉండడంతో నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ మరికొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో విజయ్ కుమార్ కొండా చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.