Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్న నితిన్.. ఆ దర్శకుడితో మళ్ళీ!
యంగ్ హీరో నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఇంతవరకు నితిన్ కొత్త చిత్రం ప్రారంభం కాలేదు. త్వరలో ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శత్వంలో నితిన్ నటించబోతున్నాడు. ఈ చిత్రం భీష్మ పేరుతో తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా నితిన్ తన తదుపరి చిత్రాల గురించి కూడా కొందరు దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ఇదిలా ఉండగా తనకు గుండె జారి గల్లంతయ్యిందే లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కుమార్ కొండతో నితిన్ మరో చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నితిన్ వరుసపరాజయాల్లో ఉన్న సమయంలో అతడి కెరీర్ ని ఇష్క్ చిత్రం నిలబెట్టింది. ఆ చిత్రం తర్వాత నితిన్ విజయ్ కుమార్ దర్శత్వంలో గుండె జారి గల్లంతయ్యిందే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నితిన్ లో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఆ తర్వాత నితిన్ కొన్ని హిట్స్, కొన్ని ప్లాప్స్ తో కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు.
ఇటీవల విజయ్ కుమార్ నితిన్ ని కలసి ఓ కథ వినిపించాడట. విజయ్ కుమార్ వినిపించిన కథ చాలా వైవిధ్యంగా ఉండడంతో నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ మరికొందరు దర్శకులతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో విజయ్ కుమార్ కొండా చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.