Mahesh Babu 'గుంటూరు కారం' రిజల్ట్​ - త్రివిక్రమ్​కు ఆ మాట ఇచ్చిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ కలయికలో 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత రీసెంట్​గా 'గుంటూరు కారం' సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా వసూళ్ల పరంగా పర్వాలేదనిపించినప్పటికీ మిక్స్​డ్​ టాక్​ను మాత్రమే సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తీయడానికి ముందు మహేశ్​ - త్రివిక్రమ్​ మధ్య పెద్ద డ్రామానే జరిగిందట! అందుకే రిజల్ట్ ఇలా వచ్చిందని తెలిసింది. దీంతో ఫైనల్​గా మహేశ్ - ​ మాటల మాంత్రికుడికి ఓ మాట ఇచ్చారంట. అదేంటంటే..

భారీ అంచనాలతో ఈ సంక్రాంతి బరిలో నిలిచిన భారీ బడ్జెట్​ సినిమా 'గుంటూరు కారం'. సంక్రాంతి పండుగ‌, అందులోనూ ఓ 'స్టార్​ హీరో - స్టార్ డైరెక్టర్'​ కాంబోలో సినిమా అంటే ఆ హంగామానే వేరుగా ఉంటుంది. రిలీజ్​కు ముందు 'గుంటూరు కారం' విష‌యంలోనూ అదే జ‌రిగింది. చాలా కాలం త‌ర్వాత మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ క‌లిసి చేసిన సినిమా అవ్వడం అందరూ మొదటి ప్రాధాన్యత దీనికే ఇచ్చారు. కానీ సీన్ రివర్స్ అయింది.

Guntur Kaaram Result Mahesh Babu Promises A pan India Movie to Trivikram Srinivas Full Details Here

ఎందుకంటే తన సినిమాల్లో కథ‌పై పూర్తి ప‌ట్టుని ప్ర‌ద‌ర్శిస్తూ బ‌ల‌మైన భావోద్వేగాలు, ప‌దునైన మాట‌లతో మేజిక్ చేసే త్రివిక్రమ్​ ఈ చిత్రంలో అలాంటి మేజిక్​ను పున‌రావృతం చేయలేకపోయారు. త‌ల్లి కొడుకుల బంధం పాయింట్​తో సాగే ఈ క‌థ ఆదిలోనే తేలిపోయింది. త్రివిక్ర‌మ్ బ‌ల‌హీన‌మైన ర‌చ‌న‌తో నిరాశ‌ప‌రిచారు.

అయితే వాస్తవానికి గుంటూరు కారం కోసం మొదట అనుకున్న కథ ఇది కాదట. త్రివిక్రమ్.. ​ మహేశ్ బాబుతో ఓ యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నారట. సినిమా ఓకే కూడా అయింది. దీనినే అనౌన్స్ చేశారు. కానీ తర్వాత కొద్ది రోజులకు మహేశ్ బాబు మనసు మారిందట. ఎందుకంటే నెక్ట్స్​ దర్శకధీరుడు రాజమౌళితో చేసేది కూడా పక్కా యాక్షన్ సినిమానే. అందుకే యాక్షన్​కు ముందు ఫ్యామిలీ ఎంటర్​ టైనర్​ సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్​తో చెప్పారట.

Guntur Kaaram Result Mahesh Babu Promises A pan India Movie to Trivikram Srinivas Full Details Here

దీంతో త్రివిక్రమ్ తన కథను మార్చుకోవాల్సి వచ్చిందట. కానీ అప్పటికే సంక్రాంతికి అంటూ సినిమా రిలీజ్​ డేట్​ను అనౌన్స్ చేసేశారు. దీంతో మాటల మాంత్రికుడు​ త్వరత్వరగా ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా కొత్త కథను రెడీ చేసి గుంటూరు కారం పేరుతో తీసుకొచ్చారు. పైగా షూటింగ్ వాయిదాల పర్వంతో కొనసాగడం, సినిమాలోని టెక్నిషియన్స్​తో పాటు ఇతర కాస్ట్ తప్పుకోవడం సహా ఇతరత్ర సమస్యల వల్ల 'గుంటూరు కారం' కొత్త కథ ఔట్ పుట్ సరిగ్గా రాలేదని అంటున్నారు.

మహేశ్​ ముందుగా అనుకున్న కథను మార్చడం, ఆ తర్వాత త్రివిక్రమ్​ తన స్టైల్​ అండ్ మేజిక్​కు తగ్గట్టుగా తీయలేకపోవడం వల్ల ఈ సినిమా రిజల్ట్ మిక్స్​డ్​ టాక్​ అందుకుంది. ఇదంతా అర్థం చేసుకున్న మహేశ్ - త్రివిక్రమ్​ ఈ సారి మళ్లీ ముందుగా అనుకున్న విధంగా యాక్షన్​ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట. మహేశ్ కూడా కచ్చితంగా సినిమా చేస్తానని త్రివిక్రమ్​కు మాట ఇచ్చారట. అయితే ఇది రాజమౌళి సినిమా అయ్యాకే పట్టాలెక్కుతుందని తెలిసింది. అంటే జక్కన్న సినిమాకు ఎలాగో రెండు, మూడేళ్లు పడుతుంది కాబట్టి త్రివిక్రమ్​ - మహేశ్ సినిమా రావడానికి చాలా సమయమే పట్టొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X