Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
గోపీచంద్ బ్యాడ్ లక్.. ఇచ్చిన రెమ్యునరేషన్ వెనక్కి తీసుకున్న నిర్మాత
టాలీవుడ్ మాస్ హీరోల్లో ఒకడైన గోపిచంద్ అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు లైక్ చేస్తారు. మొదట్లో ఎంతగానో కష్టపడి విలన్ గా చేసిన గోపిచంద్ ఆ తరువాత హీరోగా మారాడు. అందుకే గోపిచంద్ కి ఇండస్ట్రీలో ఒక మంచి పేరుంది. ఎలాంటి కాంట్రవర్సీలకు పోకుండా పెద్దగా హడావుడి కూడా చేయకుండా ఉండే గోపి అంటే స్టార్ హీరోలకు కూడా ఇష్టమే. ప్రభాస్ గోపిచంద్ బెస్ట్ ఫ్రెండ్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
నిర్మాతకు డబ్బులు ఇచ్చేసిన హీరో..
ఇక గత కొంత కాలంగా గోపిచంద్ వరుస అపజయలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని డిఫరెంట్ సినిమాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. అయితే ఇటీవల ఒక సినిమా క్యాన్సిల్ అవ్వడంతో గోపిచంద్ నిర్మాతకు డబ్బులు వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఒక విధంగా కరోనా దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది.
తమిళ్ దర్శకుడితో స్టార్ట్ చేసిన ఆ సినిమా..
సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ ప్రొడక్షన్ లో గత ఏడాది ఒక సినిమాను ఎనౌన్స్ చేశారు. తమిళ్ డైరెక్టర్ సెల్వా రాఘవన్ తెరకెక్కించిన యుగానికి ఒక్కడు, వర్ణ సినిమాలకి సహాయ దర్శకుడిగా పని చేసిన భిను సుబ్రహ్మణ్యం దర్శకుడిగా పరిచయం అవుతూ లాంచ్ అయిన ఆ సినిమాను సమ్మర్ లోనే స్టార్ట్ చేయాల్సింది. కానీ కరోనా వైరస్ దెబ్బకు వెనకడుగు వేయాల్సి వచ్చింది.
రెండు కోట్ల రెమ్యునరేషన్ ని..
హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ గా ఆ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు అప్పట్లో టాక్ బాగానే వచ్చింది. కానీ సినిమాను ప్రస్తుత పరిస్థితుల్లో తెరకెక్కించలేను అని నిర్మాత వివరణ ఇవ్వడంతో గోపిచంద్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. అడ్వాన్స్ గా ఇచ్చిన రెండు కోట్ల రెమ్యునరేషన్ ని కూడా నిర్మాత వెనక్కి తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
Recommended Video
ఆ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని
ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని ఇప్పటికే గోపీచంద్ వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అతని చేతిలో సీటీమార్ సినిమా మాత్రమే ఉంది. గౌతమ్ నంద దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా గట్టిగా కష్టపడుతున్నారు. మరి గోపీకి ఎలాంటి సక్సెస్ వస్తుందో చూడాలి. తేజ దర్శకత్వంలో కూడా గోపి ఒక సినిమాకు కమిటైన విషయం తెలిసిందే.