Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెద్ద మనసు చాటుకున్న నాని.. రక్తదానం చేసిన స్టార్
ప్రస్తుతం కరోనా కోరల్లో ప్రపంచం చిక్కుకుంది. ఈ వైరస్ను అరికట్టేందుకు ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ను పాటిస్తున్నాయి. మన దేశంలో కూడా గత నెల నుంచి లాక్ డౌన్లోనే ఉంది. తాజాగా మరోసారి ఇంకో 19 రోజుల పాటు పొడిగించారు. ఇలాంటి స్థితిలో మరో విపత్కర పరిస్థితి ఏర్పడింది.
లాక్ డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితం అవ్వడం రక్తం నిల్వలు తగ్గిపోయాయి. బ్లడ్ బ్యాంక్లో కూడా రక్తం లేకుండా పోయింది. దీంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా తలసేమియా వ్యాధితో బాధపడే పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ క్రమంలోనే న్యాచురల్ స్టార్ నాని ముందుకు వచ్చి రక్త దానం చేశాడు.
రక్త దానం చేసిన నాని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు అందించాడు. ఈ విషయానికి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. అలాగే గివ్ బ్లడ్ సేవ్ లైఫ్... నినాదంతో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిరంతరం సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బ్లడ్ బ్యాంకులకు రక్త దాతల కొరత తీవ్రంగా వేధిస్తోందని అందరూ రక్తదానం చేయండని నాని పిలుపునిచ్చాడు.