Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
2500 కేజీల బియ్యం, 3000 మందికి భోజనం.. తిత్లీ భాదితులకు యంగ్ హీరో సాయం!
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. చాలా మంది ప్రజలు తుఫాన్ వలన తీవ్రంగా నష్టపోయారు. కొంతమంది నిరాశ్రయులుగా మారారు. తుఫాన్ బాధితుల్ని ఆదుకునేందుకు టాలీవడ్ హీరోలు ఒక్కొక్కరుగా నడుం బిగిస్తున్నారు. తాజగా యంగ్ హీరో నిఖిల్ తుఫాన్ భాదితుల కోసం దగ్గరుండి సాయం చేశాడు.
2500 కేజీల బియ్యాన్ని తుఫాన్ భాదితుల కోసం సరఫరా చేసాడు అంతే కాదు. దాదాపు 3000 మంది కోసం భోజనం కూడా ఏర్పాటు చేశాడు. గుప్పిడి పేట, పల్లి సారధి వంటి కొన్ని గ్రామాలలో నిఖిల్ స్వయంగా సహాయక చర్యలు చేపట్టాడు. తుఫాన్ బాధితులతో కలసి నిఖిల్ కూడా భోజనం చేయడం విశేషం.
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్ వంటి హీరోలంతా తిత్లీ భాదితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. మరికొంతమంది సినీప్రముఖులు కూడా తుఫాన్ భాదితులకు ఆర్థిక సాయం అందజేయడానికి ముందుకు వస్తున్నారు.
2500 kilos of Rice
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 15, 2018
500 Blankets
Portable Generators for Power cuts.
Dinner for 3000 people who need cooked food immediately.
Was arranging these things here in Srikakulam all day... Now in GUPPIDIPETA..next on to PALLISARADHI
Stay strong Srikakulam👏
#istandwithAndhraPradesh pic.twitter.com/ny7R6Ckjba