Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కళ్ళముందే చనిపోయారు.. హీరో నిఖీల్ ఎమోషనల్, మోడీతో పాటు వాళ్ళందరికి ఇచ్చి పడేశాడు
టాలీవుడ్ యువ హీరో నిఖీల్ మొదటిసారి ఎమోషనల్ అవుతూ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. కళ్ళముందే మనుషులు చనిపోవడం తనను ఎంతగానో కలచి వేసిందని బాధపడుతూ వివరణ ఇచ్చారు. నిఖీల్ ఇటీవల షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఒక మంచి పనితో బిజీ అయ్యాడు. అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Recommended Video
గాలి కంటే వేగంగా
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ గాలి కంటే వేగంగా వ్యాప్తిస్తోంది. నిమిషానికి ఒక వ్యక్తి మరణిస్తూ ఉండడం అందరిని కలచి వేస్తోంది. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియని సందిగ్ధంలో కోట్లాది మంది కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సమయంలో కొంతమంది సెలబ్రెటీలు వారి వైవు నుంచి సహాయం అందిస్తున్నారు.
కళ్ళముందే చనిపోతున్నారు
హీరో నిఖీల్ ఈ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు. తన స్నేహితులతో కొంతమందితో కలిసి అవసరమైన వారికి ఆక్సిజన్ లు వెంటిలేటర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. అయితే ఈ సమయంలో ఎంత సహాయం చేసినా కూడా సరిపోదు అంటూ కొంతమంది అయితే కళ్ళముందే చనిపోతున్నట్లు ఆవేదన చెందారు.
ఒక వ్యక్తికి ఫోన్ చేయగానే..
బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఫోన్ చేసిన కొద్దిసేపటికే ఆక్సిజన్ రెడీ చేశాము. కానీ మళ్ళీ సంప్రదింపులు జరిపే సరికి అప్పటికే అతను మరణించినట్లు తెలియజేయడం అందరిని షాక్ కు గురి చేసింది. అలాంటి మరణాలు చాలా బాధను కలిగిస్తున్నాయి.. అని నిఖీల్ ఎమోషన్ అయ్యాడు.
|
రాజకీయా నాయకులు అలా బిజీగా ఉన్నారు
పరిస్థితి చేయి దాటిపోతే ఎవరు కూడా మనకు సహాయం చేసే ఛాన్స్ లేదు. నిజానికి ఎంతోమంది సాధారణ ప్రజలే ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. కానీ రాజకీయాల నాయకులు మాత్రం ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు అంటూ వీడియో ద్వారా కౌంటర్ ఇచ్చిన నిఖీల్.. మోడీజీ కూడా మిగతా విషయాలపై కాకుండా ప్రస్తుత పరిస్థితులపై ఎక్కువగా ఫోకస్ పెడితే బావుంటుందని నిఖీల్ ట్వీట్ చేశాడు.