Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నితిన్, కీర్తీ సురేష్ డ్యాన్సింగ్ జోష్.. అమేజింగ్ టీమ్తో రంగ్దే పూర్తి!
మాస్ సినిమలైనా క్లాస్ సినిమలైనా తనదైన శైలిలో ప్రజెంట్ చేసే యువ హీరో నితిన్ ఈ ఏడాది మరింత స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది. గత ఏడాది భీష్మ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నితిన్ వెంటనే మరో సినిమాను కూడా రిలీజ్ చేయాలని అనుకున్నాడు. కానీ కరోనా లాక్ డౌన్ వలన ప్లాన్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది.
ఇక 2021లో మాత్రం అలా కాకుండా ఉండాలని నితిన్ పర్ఫెక్ట్ ప్లాన్ తో రెడీ అవుతున్నాడు. ముందుగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న చెక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆ సినిమా రిలీజ్ కాకముందే నితిన్ మరో సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు.
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరితో నితిన్ రంగ్ దే అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఆ సినిమా షూటింగ్ నేటితో పూర్తయినట్లు నితిన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇక సినిమాను మార్చ్ 26న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం నితిన్ అందాదున్ రీమేక్ తో రానున్నాడు. ఆ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నాడు.