Don't Miss!
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రెమ్యునరేషన్ ను కూడా త్యాగం చేయడానికి సిద్దమైన వెంకటేష్
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా సినిమా నిర్మాతలు చాలా వరకు కన్ఫ్యూజన్ లో పడ్డారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పరిస్థితి కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఒకవైపు నిర్మాతలు వారి సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తుంటే మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరపడవద్దు వేడుకుంటున్నారు కూడా.
సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడం రిస్క్ తో కూడుకున్న పని అని నిర్మాత సురేష్ బాబు లాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఓటీటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అయితే హీరోలకు ఎవరికి కూడా ఓటీటీ డీల్స్ పై ఇంట్రెస్ట్ లేదు గాని నిర్మాత ఆలోచనను దృష్టిలో ఉంచుకొని ఏమి అనడం లేదు. అయితే వెంకటేష్ మాత్రం ధైర్యం చేసి తన అన్నయ్యను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.
అన్న దమ్ములు అయినప్పటికీ సురేష్ బాబు వెంకటేష్ కు డిమాండ్ ఉన్నంత రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఇక దృశ్యం, నారప్ప సినిమాలు సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే తెరకెక్కాయి కాబట్టి వాటికి కూడా గట్టిగానే అందుకున్నారు. అయితే సురేష్ బాబు ఓటీటీ డీల్ కు సిద్ధమవ్వగా అందుకు వెంకటేష్ ఒప్పుకోలేదట. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల బాధను కూడా అర్థం చేసుకోవాలని అక్టోబర్ వరకు వేయిట్ చేయమని చెప్పారట. ఒకవేళ సినిమా తేడా కొడితే రెమ్యునరేషన్ ను కూడా వధులుకోవాడానికి వెంకటేష్ సిద్ధంగా ఉన్నట్లు టాక్ తెలుస్తోంది. అదే తరహాలో మరికొందరు హీరోలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం.