Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెమ్యునరేషన్ ను కూడా త్యాగం చేయడానికి సిద్దమైన వెంకటేష్
లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా సినిమా నిర్మాతలు చాలా వరకు కన్ఫ్యూజన్ లో పడ్డారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల పరిస్థితి కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఒకవైపు నిర్మాతలు వారి సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తుంటే మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరపడవద్దు వేడుకుంటున్నారు కూడా.
సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేయడం రిస్క్ తో కూడుకున్న పని అని నిర్మాత సురేష్ బాబు లాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా ఓటీటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అయితే హీరోలకు ఎవరికి కూడా ఓటీటీ డీల్స్ పై ఇంట్రెస్ట్ లేదు గాని నిర్మాత ఆలోచనను దృష్టిలో ఉంచుకొని ఏమి అనడం లేదు. అయితే వెంకటేష్ మాత్రం ధైర్యం చేసి తన అన్నయ్యను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.
అన్న దమ్ములు అయినప్పటికీ సురేష్ బాబు వెంకటేష్ కు డిమాండ్ ఉన్నంత రెమ్యునరేషన్ ఇస్తుంటారు. ఇక దృశ్యం, నారప్ప సినిమాలు సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే తెరకెక్కాయి కాబట్టి వాటికి కూడా గట్టిగానే అందుకున్నారు. అయితే సురేష్ బాబు ఓటీటీ డీల్ కు సిద్ధమవ్వగా అందుకు వెంకటేష్ ఒప్పుకోలేదట. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల బాధను కూడా అర్థం చేసుకోవాలని అక్టోబర్ వరకు వేయిట్ చేయమని చెప్పారట. ఒకవేళ సినిమా తేడా కొడితే రెమ్యునరేషన్ ను కూడా వధులుకోవాడానికి వెంకటేష్ సిద్ధంగా ఉన్నట్లు టాక్ తెలుస్తోంది. అదే తరహాలో మరికొందరు హీరోలు కూడా డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం.