Don't Miss!
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- News తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు నేడే: కాంగ్రెస్ సిఈసి భేటీకి సీఎం రేవంత్ రెడ్డి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
లెజెండ్తో మహేష్ బాబు... ఇది నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ ట్వీట్!
'మహర్షి' మూవీ గ్రాండ్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి యూరఫ్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో మహేష్ బాబు మరింత ఖుషీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుండటంతో అక్కడ కుటుంబంతో వాలిపోయారు.
ఇటీవల ఇంగ్లండ్లో ఓవల్ వేదికగా జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భగా 'మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా వారితో జాయిన్ అయ్యారు. అంతా కలిసి దిగిన సెల్ఫీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
|
లెజెండ్తో మహేష్ బాబు
మహేష్ బాబు తాజాగా క్రికెట్ లెజెండ్ ఆండీ రాబర్డ్స్తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఇది నాకు గొప్ప అనుభూతి అని, నేను ఆయనకు పెద్ద అభిమాని, హ్యూజ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ ట్వీట్ చేశారు ఈ టాలీవుడ్ సూపర్ స్టార్.
ఇది జీవితాంతం గుర్తుండి పోయే ట్రిప్
‘మహర్షి' మూవీ విజయంతో సూపర్ హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబుకు... ఆండీ రాబర్డ్స్ ఎదురు పడటంతో ఈ పర్యటన మరింత స్పెషల్గా మారింది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా వస్తుందని మహేష్ బాబు తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.
'సరిలేరు నీకెవ్వరు'
ఇండియా వచ్చిన వెంటనే మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో జాయిన్ కాబోతున్నారు. మహేష్ కెరీర్లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సైనికుడి పాత్రలో సూపర్ స్టార్
'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఆర్మీ ఆఫీసర్గా మహేష్ బాబు కనిపిస్తారని, అనిల్ రావిపూడి సినిమాల తరహాలో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోందని టాక్. లీకైనట్లుగా చెబుతున్న కథ ప్రకారం... ఈ చిత్రంలో మహేష్ బాబు ఫ్రెండ్ తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతోందట. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారని, నిర్మాత బండ్ల గణేష్ఒక ఫన్నీలో నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రష్మిక మందన్న మహేష్ బాబుకు ప్రియురాలి పాత్రలో నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తోందట.