Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Ram charan: క్రికెట్ మ్యాచ్ తరువాత రామ్ చరణ్ ఇంట్లో ఆ స్టార్ క్రికెటర్.. ఫొటో వైరల్!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలాసార్లు ఐపీఎల్ మ్యాచ్ లను అలాగే టీమిండియా మ్యాచ్ లను కూడా ప్రత్యేకంగా స్టేడియంలో వీక్షించాడు. ఇక గతంలో కొంతమంది స్టార్ క్రికెటర్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చారు. వారితో ప్రత్యేకంగా వెళ్లి భోజనాలకు కూడా చేశారు. ఇక ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ ను కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అద్భుత విజయం
ఇండియా ఆస్ట్రేలియా మూడవ టి20 హైదరాబాదులో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తక్కువ బాల్స్ ఎక్కువ రన్స్ ఉన్న సమయంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసిన విధానంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. దీంతో ఫ్యాన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో టీమిండియా కు విషెస్ అందించారు.
రామ్ చరణ్ తో క్రికెటర్
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ మ్యాచ్ ను ప్రత్యేకంగా వీక్షించినట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన మ్యాచ్ విన్నర్ గా నిలిచిన స్టార్ క్రికెటర్ ను కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే మెగాస్టార్ ఇంటికి కొంతమంది సీనియర్ క్రికెటర్లు కూడా వచ్చారు ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ మెగా ఫ్యామిలీకి చాలా మంచి స్నేహితుడు కూడా.
గతంలోనే..
అలాగే రామ్ చరణ్ తేజ్ గతంలో విరాట్ కోహ్లీ మహేంద్రసింగ్ ధోనిని కూడా కలుసుకున్నాడు. ఇక ఈసారి అతను టీమిండియా ఆల్ రౌండర్ హార్థికా పాండ్యను కూడా ప్రత్యేకంగా కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదట ఈ వార్త అబద్దం అని అందరూ అనుకున్నారు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో ద్వారా ఆ క్లారిటీ వచ్చేసింది.
రామ్ చరణ్ ఇంట్లో హార్దిక్ పాండ్యా
హార్థిక్ పాండ్యా మ్యాచ్ ముగించగానే హైదరాబాద్లోనే రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడే ప్రత్యేకంగా కొంత సేపటి వరకు మెగా ఫ్యామిలీతో ముచ్చటించిన హార్థిక్ పాండ్యా పలువురు మెగా హీరోలను కూడా కలుసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మెగా ఫ్యామిలీకి చెందిన డిజిటల్ మీడియా మేనేజర్ ఒక ఫోటో ద్వారా తెలియజేశారు. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మరికాసేపట్లో ఫొటోలు
ఇక మరికొద్ది సేపట్లో హార్దిక్ పాండ్యా రాంచరణ్ తో దిగిన కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మ్యాచ్ విన్నర్ గా నిలిచిన హార్థిక్ పాండ్యాను ప్రత్యేకంగా రామ్ చరణ్ అభినందించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా హార్థిక్ పాండ్యాతో ఫోటోలు దిగినట్లుగా తెలుస్తోంది.