Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో.. ఆసక్తికరంగా మహేష్, సుకుమార్ సినిమా!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శత్వంలో మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం తరువాత మహేష్ సుకుమార్ దర్శత్వంలో నటించేందుకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. రంగస్థలం చిత్రంతో సుకుమార్ అద్భుత విజయం సొంతం చేసుకున్నాడు. రంగస్థలం తరహాలోనే సుకుమార్ మహేష్ కోసం ఆసక్తికరమైన కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో జరిగే పీరియాడిక్ డ్రామాగా సుకుమార్ కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 1980 నాటి పరిస్థితుల నేపథ్యంలో సుకుమార్ రంగస్థలం చిత్రం రూపొందించిన సంగతి తెలిసిందే. మహేష్ కోసం కథని మరింత ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుని వెళ్లనున్నారు.
ఈ చిత్రానికి సంబందించిన పూర్తి కథని సిద్ధం చేసే పనిలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. సుకుమార్, మహేష్ కాంబినేషన్ లో ఇప్పటికే 1 నేనొక్కడినే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.