Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆసక్తిని రేకెత్తించే అంశంతో నితిన్, చంద్రశేఖర్ యేలేటి చిత్రం
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాది ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇది కాక నితిన్ మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కి కూడా ఒకే చెప్పాడు. అందులో ఒకటి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలోని చిత్రం.
చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చిత్రానికి సంబంధించి ఆసక్తిని పెంచే అంశం బయటకు వచ్చింది. ఈ కథలో అవయవ దానం ప్రాముఖ్యతని దర్శకుడు తెలియజేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినోదాన్ని అందిస్తూనే అవయవదనం అంశాన్ని చంద్రశేఖర్ యేలేటి హైలైట్ చేయబోతున్నారట. చంద్రశేఖర్ యేలేటి ఎప్పుడూ విభిన్నమైన కథలకు ప్రాధ్యానత ఇస్తారు. నితిన్ తో తెరకెక్కించబోయే చిత్రంలో కూడా కథే కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలు అందించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వెంకీ కుడుముల దర్శకత్వంలోని భీష్మ చిత్రాన్ని కూడా నితిన్ త్వరలో ప్రారంభించనున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి పవర్ పేట అనే టైటిల్ ప్రచారంలో ఉంది.