Don't Miss!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రౌడీయిజంపై నితిన్ సినిమా.. కథ ఇదేనా!
యంగ్ హీరో నితిన్ గత ఏడాది ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించాడు. ఈ రెండు చిత్రాలు నితిన్ కు నిరాశనే మిగిల్చాయి. ఈ ఏడాదిలో మాత్రం తన చిత్రాల విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని నితిన్ భావిస్తున్నాడు. ఛలో చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న వెంకీ కుడుముల దర్శత్వంలో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కాకుండా నితిన్ ఇటీవల తన బర్త్ డే సందర్భంగా మరో రెండు చిత్రాలని ప్రకటించాడు. దీనితో నితిన్ నటించబోయే తదుపరి మూడు చిత్రాలు ఖరారయ్యాయి.
కృష్ణ చైతన్య దర్శత్వంలో నితిన్ ఓ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రానికి పవర్ పేట్ అనే ఆసక్తికరమైన టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర కథ రౌడీయిజం నేపథ్యంలో ఉండబోతోందట. ఈ చిత్రానికి పవర్ పేట్ అనే టైటిల్ ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. ఏలూరు లో పవర్ పేట్ అనే రైల్వే స్టేషన్ ఉంది. బ్రిటిష్ కాలం నుంచి ఆ ప్రాంతానికి పవర్ పేట్ అనే పేరు వచ్చిందట.
ఆ ప్రాంతంలో రౌడీయిజం ఛాయలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ వద్ద పనిచేసిన రౌడీషీటర్స్ హత్యలు చాలా దారుణంగా జరిగాయట. ఈ అంశంతోనే కృష్ణ చైతన్య కథ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. కృష్ణ చైతన్య ఏలూరు నగరానికి చెందిన వ్యక్తే కావడంతో ఈ అంశాలపై పూర్తి అవగాహనతో ఉన్నట్లు తెలుస్తోంది.