Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మళ్లీ మళ్లీ పని చేయాలని ఉంది.. హీరో కార్తికేయపై జానీ మాస్టర్ కామెంట్స్
హీరో కార్తికేయ డ్యాన్సుల్లో ఎంతలా చేస్తాడో.. వాటితో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో అందరికీ తెలిసిందే. ఏకంగా చిరంజీవి పాటలన్నంటికి అదిరిపోయే స్టెప్పులేసి మెగా అభిమానిగా ఓ ట్రిబ్యూట్ ఇచ్చాడు. ఆ పర్ఫామెన్స్ చూసి అందరూఫిదా అయ్యారు. ఇక తెరపైనా కార్తీకేయ తన స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటాడు. అలాంటి కార్తీకేయకు ఇప్పుడు చావు కబురు చల్లగా అనే మాస్ సినిమా దొరికింది.
ఇప్పటికే వదిలిన టీజర్, పోస్టర్లు బాగానే క్లిక్ అయ్యాయి. తాజాగా ఈ మూవీ నుంచి మాస్ నంబర్ను వదిలారు. మై నేమ్ ఈజూ బస్తీ బాలరాజు అంటూ వదిలిన ఈ సాంగ్లో కార్తీకేయ అదిరిపోయే స్టెప్పులను వేసినట్టు లిరికల్ వీడియోను చూస్తేనే తెలుస్తోంది.అయితే ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడట. ఈ మేరకు తాజాగా జానీ మాస్టర్ ఓ పోస్ట్ చేశాడు. అందులో హీరోపై ప్రశంసలు కురిపించాడు.
అసలే ఇప్పుడు జానీ మాస్టర్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాడు. అలాంటి జానీ మాస్టర్ కార్తీకేయ కోసం అదిరిపోయే మాస్ స్టెప్పులను కంపోజ్ చేశాడని తెలుస్తోంది. ఈ మేరకు జానీ మాస్టర్ పోస్ట్ చేస్తూ.. చావు కబురు చల్లగా నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ రెడీ అయింది.. ఇంకా మున్ముందు కార్తీకేయతో కలిసి పని చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. దానికి కార్తీకేయ స్పందిస్తూ.. మీతో కలిసి పనిచేయడం ఎప్పుడూ సరదాగా, ఆత్రుతగానే ఉంటుంది.. థాంక్యూ మాస్టర్ అని కామెంట్ పెట్టాడు.