Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మళ్ళీ బరువు తగ్గాల్సిందే.. RRR తరువాత చేయబోయే పాన్ ఇండియా సినిమాపై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్
RRR సినిమా తో మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగించిన జూనియర్ ఎన్టీఆర్ వీలైనంత వేగంగా తన తదుపరి సినిమాలను కూడా మొదలు పెట్టాలి అనుకుంటున్నాడు. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చివరగా చేసినటువంటి అరవింద సమేత సినిమా తరువాత మళ్లీ మూడేళ్ళ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో వచ్చాడు. చాలా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశ చెందారు. కానీ ఎట్టకేలకు RRR సినిమాతో ఆ బాధను మొత్తం మరిచిపోయే విధంగా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో మెప్పించాడు. ఇక తదుపరి సినిమా ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ గా ఒక అప్డేట్ ఇచ్చాడు.
RRRతో సరికొత్త సంచలనం
గతంలో ఎప్పుడూ లేని విధంగా మెగా నందమూరి కలయికలో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ RRR బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతా రామ రాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ఇద్దరి పాత్రలను కూడా దర్శకుడు రాజమౌళి కథకు తగ్గట్టుగా పవర్ ఫుల్ గా చూపించాడు.
ఎన్టీఆర్ కు బిగ్ ఛాలెంజ్
మొత్తానికి RRR సినిమా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకొని మరిన్ని వసూళ్లు సాధించే విధంగా దూసుకుపోతోంది. అయితే తదుపరి పాన్ ఇండియా సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా సక్సెస్ అందుకుంటాడు అనేది పెద్ద చాలెంజ్ అనే చెప్పాలి. RRRకు రాజమౌళి బ్రాండ్ బాగా హెల్ప్ అయ్యింది. ఇక ఇప్పుడు రాజమౌళి లేకుండా తన సొంత క్రేజ్ తో పాన్ ఇండియా వద్ద సక్సెస్ ఆ దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జూన్ నుంచి మొదలు..
ఇటీవల ఒక బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఆ విషయంపై స్పందిస్తూ.. తన తదుపరి పాన్ ఇండియా సినిమా జూన్ నుంచి మొదలవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు.
బరువు తగ్గాల్సిందే..
ఇక కొరటాల శివ తో చేయబోయే సినిమాలో చాలా వరకూ ఫిట్నెస్ మార్పులు చేయాల్సి ఉంటుందని ప్రస్తుతం ఉన్న బరువు కంటే ఇంకాస్త తగ్గాల్సిన అవసరం ఉందని కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలియజేశాడు. ఆ సినిమా కూడా లో ఉండే మంచి సందేశం అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని కూడా వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం దర్శకుడు పూర్తి కథను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లో..
జనతా గ్యారేజ్ సినిమా తర్వాత మళ్లీ కొరటాల శివ తో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు అనగానే అభిమానులలో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సౌత్ లో అయితే ఈ కాంబినేషన్ కు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయింది. కానీ నార్త్ లో జనాలు ఎంతవరకు కనెక్ట్ అవుతారు అనేది మరొక ఆసక్తికరమైన విషయం. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ నటించనుంది.