Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
ఓ వైపు ఏపీలో పొలిటికల్ టెన్షన్... జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెన్సేషన్, వీడియో వైరల్
Recommended Video
తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ టెన్షన్ కాస్త ఎక్కువగానే ఉంది. రాష్ట్రంలో ఈ సారి అధికారంలోకి వచ్చేది ఎవరు? అనే అంశంపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఆదివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
మెజారిటీ సర్వేలు ఈ సారి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్ సీఎం అవతాడని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అభిమానుల్లో టెన్షన్ మరింత ఎక్కువైంది. ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇందుు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత ఎన్టీఆర్ ఇంటి బాట పట్టిన ఫ్యాన్స్
ఆదివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ కారణంగా టెన్షన్తో ఉన్న ఫ్యాన్స్ అదే రోజు అర్దరాత్రి భారీ సంఖ్యలో మెహదీపట్నంలోని ఎన్టీఆర్ నివాసానికి చేరుకున్నారు. జై ఎన్టీర్, సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
|
వైరల్ అవుతున్న వీడియో
ఎన్టీఆర్ ఇంటి వద్ద అభిమానులు హంగామా చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో మరింత మంది నందమూరి అభిమానుల్లో తారక్ పొలిటికల్ ఎంట్రీ అంశంపై ఆసక్తి పెంచుతోంది. అత్యంత ప్రజాకర్షణ కలిగి ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని, ఆ సమర్దత అతడికి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఏమంటున్నారు?
గతంలో పలు సందర్భాల్లో ఎన్టీఆర్కు పొలిటికల్ ఎంట్రీ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆ వార్తలపై ఆయన స్పందిస్తూ... తాను ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడం లేదని, తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని తెలిపారు. కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ వేరే పార్టీలోకి వెళుతున్నట్లు వార్తలు రాగా... ఆయన ఖండించారు. తన తాతయ్య స్థాపించిన తెలుగు దేశం పార్టీకి జీవితాంతం విధేయుడిగా ఉంటానని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఎన్టీఆర్ వస్తాడనే నమ్మకంలో ఫ్యాన్స్
ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చేందుకు తగిన వయసు లేక పోవడం, సినిమా రంగంలో సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నందున యంగ్ టైగర్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టడం లేదని, అయితే భవిష్యత్తులో అతడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడని... ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.