Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఇంకా ఎన్టీఆర్ ఖాతాలోనే అరుదైన రికార్డ్.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా ఘనత
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' సినిమా నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత'.. ఇలా వరుస సినిమాలతో తన హవా చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది అతడి ఖాతాలో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. అది ఈ సంవత్సరం కూడా ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు.
అరుదైన ఘనత
జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు అరుదైన ఘనత దక్కింది. దక్షిణ కొరియాలో నిర్వహించిన బుచాన్ ఇంటర్నేషనల్ ఫెంటస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘జై లవ కుశ' సినిమాను ప్రదర్శించారు. ఉత్తమ ఏసియా చిత్రాల జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకోవడంతో ఈ సినిమాను అక్కడ ప్రదర్శించారు. అంతేకాదు, అక్కడ ప్రదర్శించిన తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.
‘జై లవ కుశ’ గురించి
జూనియర్ ఎన్టీఆర్ - బాబీ కాంబినేషన్లో వచ్చిన చిత్రమే ‘జై లవ కుశ'. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేశాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో తారక్ నటవిశ్వరూపానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, నివేదా థామస్ నటించారు.
కారణం ఇదే
ఈ ఫెస్టివల్కు ఎంపికైన ఈ సినిమాలను ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. 'జై లవకుశ' సినిమా బుచీయోన్ ఫిలిం ఫెస్టివల్కు ఎంపిక కావడం వెనుక ఓ కారణం ఉంది. ఒకే హీరో మూడు పాత్రలను చేయడంతో పాటు, క్లిష్టమైన మూడు వేరియేషన్స్ను చూపిస్తూ మెప్పించడం చాలా కష్టంతోకూడుకున్నది. మూడు పాత్రలలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. అందుకే ఈ సినిమా ఫిలిం ఫెస్టివల్కు ఎంపికైందని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సారి బాలీవుడ్ నుంచి ఒక సినిమా
రణ్వీర్ సింగ్ - ఆలియా భట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘గల్లీ బాయ్'. జోయా అక్తర్ తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం దక్షిణ కొరియాలో నిర్వహించిన బుచాన్ ఇంటర్నేషనల్ ఫెంటస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు.
తెలుగులో మంచి సినిమాలు వచ్చినప్పటికీ..
2017 సంవత్సరానికి ‘జై లవ కుశ' స్థానం దక్కించుకోగా.. 2018 సంవత్సరానికి గానూ మరే తెలుగు సినిమా ఈ ఛాన్స్ దక్కించుకోలేదు. గత సంవత్సరం తెలుగులో చాలా మంచి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి కూడా తెలుగు సినిమా ఉంటుందని చాలా మంది అనుకున్నారు. ముఖ్యంగా ‘మహానటి' సినిమా నామినేట్ అవుతుందన్న టాక్ వినిపించింది. కానీ, దానికి భిన్నంగా జరిగింది.
తారక్ ప్రస్తుతం చేస్తున్న సినిమా
ప్రస్తుతం తారక్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR'లో నటిస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. కొద్దిరోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.