Don't Miss!
- News 527 భారత ఫుడ్ ఐటమ్స్ లో క్యాన్సర్ కారకాలు-జాబితాలో ఇవే- ఈయూ గుర్తింపు..!
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
యువ హీరోకు కరోనా షాక్.. చేతులెత్తేసిన నిర్మాత..
బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్కు నిర్మాతలు షాకిచ్చారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 3డీ మూవీ షూటింగును నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు పలు దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ జరపలేమని స్పష్ం చేశారు. ఈ చిత్రాన్ని టీ సీరిస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
కార్తీక్ ఆర్యన్ 3డీ థ్రిల్లర్ సినిమా షూటింగ్ వాయిదా వేశాం. ఈ సినిమాను విదేశాల్లో చిత్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ హంకాంగ్లో చేయాల్సింది. కరోనా కారణంగా సాధ్యపడలేదు. ఈ యాక్షన్ సినిమాకు సంబంధించిన షూటింగు డేట్లను తర్వాత పరిస్థితుల అనుకూలతన బట్టి ప్రకటిస్తామని యూనిట్ వెల్లడించింది.
ఇక ఓం రౌత్ విషయానికి వస్తే.. తానాజీ: ది అన్సంగ్ వారియర్ అనే సినిమాను అజయ్ దేవగన్, సైఫ్ ఆలీ ఖాన్, కాజోల్తో చిత్రీకరించారు. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత ఆర్యన్ కార్తీక్తో రౌత్ సినిమాను యాక్షన్ 3డీ చిత్రాన్ని ప్రారంభించారు.
ఆర్యన్ కార్తీక్ కెరీర్ విషయానికి వస్తే.. భూల్ భులయ్యా2, దోస్తానా 2 సినిమాలో నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహర్ రూపొందించే ఓ చిత్రంలో జాన్వీ కపూర్; లక్ష్ లాల్వానీ హీరోయిన్లతో కలిసి ఆర్యన్ నటించనున్నారు.