Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఛాలెంజ్ను స్వీకరించిన కార్తికేయ.. ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో దశను ఎంపీ సంతోష్ కుమార్ ఇటీవలె ప్రారంభించిన సంగతి తెలిసిందే. డార్లింగ్ ప్రభాస్ చేతుల మీదుగా మొదలైన ఈ మూడో దశ బాగానే వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ప్రభాస్ తన ఇంటి ప్రాంగణంలోనే మొక్కలు నాటాడు. ఎంపీ సంతోష్తో కలిసి మొక్కలతో పాటు సెల్ఫీ దిగాడు. ఇక ప్రభాస్ మొదలెట్టిన ఈ ఛాలెంజ్ క్రమ క్రమంగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం యంగ్ హీరో కార్తికేయ తన వంతుగా మొక్కలు నాటాడు.
అయితే కార్తికేయ వద్దకు ఈ ఛాలెంజ్ విశ్వక్సేన్ నుంచి వచ్చింది. ఫలక్ నుమా దాస్ ఫేస్ విశ్వక్సేన్ విసిరిన సవాల్ను విసిరిన హీరో కార్తికేయ తన వంతుగా మొక్కలు నాటాడు. ఈ మేరకు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించాను మూడు మొక్కలను నాటానని పేర్కొన్నాడు. అందరూ కూడా మొక్కలు నాటాలని కోరాడు.
కార్తికేయ మాట్లాడుతూ ప్రపంచంలో వాతావరణం మనల్ని ప్రశ్నిస్తుంది అని పర్యావరణం రక్షించుకోవడం అందరి బాధ్యత అని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని రక్షించాలని కోరారు ఈ చాలెంజ్ లో నన్ను భాగస్వామ్యం చేసిన చేసిన రాజ్యసభ సభ్యులు సంతోష్కు కృతజ్ఞతలు తెలిపాడు. కార్తికేయ ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తోంది.