Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అఖిల్కు జోడిగా స్టార్ హీరోయిన్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో!
అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలతో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రం నుంచి అఖిల్ కు నిరాశే ఎదురవుతోంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు మూడూ వరుసగా నిరాశపరిచాయి. దీనితో అఖిల్ తొలి విజయం మరోమారు వాయిదా పడ్డట్లు అయింది. ఈ సారి అఖిల్ మంచి కథని ఎంపిక చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ వినిపించిన కథ నచ్చడంతో అతడు ప్లాపుల్లో ఉన్నా అఖిల్ ఒకే చేశాడట.
తాజాగా ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు అఖిల్ అంతగా గుర్తింపు లేని యంగ్ హీరోయిన్లతో నటించాడు. కానీ ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాలని బొమ్మరిల్లు భాస్కర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ పేరు వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది.
కియారా అద్వానీ భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ ఏడాది రాంచరణ్ సరసన నటించిన వినయ విధేయ రామ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. అఖిల్ కు హీరోయిన్ గా నటించే విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.