Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
తమిళ్, తెలుగు ఆడియెన్స్కు ఉన్న తేడా అదే.. పైరసీపై హీరో విశాల్ షాకింగ్ కామెంట్స్
కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను సెట్ చేసుకున్న విశాల్ తెలుగులో కూడా ఒక నమ్మకమైన మార్కెట్ ను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. విశాల్ ఏ సినిమా చేసినా అవి తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదల అవుతుంటాయి. పెట్టిన పెట్టుబడికి బయ్యర్లకు మంచి ప్రాఫిట్స్ ను అందించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక నెక్స్ట్ విశాల్ చక్ర సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇక పైరసీ పై స్పందిస్తూ.. ఆ విషయంలో తెలుగు, తమిళ్ ఆడియెన్స్ కు ఉన్న తేడా గురించి కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు.
ఓటీటీ రూమర్స్
వీలైనంత వరకు ఏడాదిలో రెండు సినిమాలు రిలీజ్ చేసే విశాల్ గత ఏడాది కరోనా కారణంగా వెండితెరను మొదటిసారి మిస్సయ్యాడు. ఇక న్యూ మూవీ చక్ర సినిమాను గత ఏడాది ఓటీటీలో విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. క్కరోనా కష్టకాలంలో కొన్ని సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలలో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
'చక్ర'తో రాబోతున్న విశాల్
ఇక విశాల్ కూడా తన నెక్స్ట్ సినిమా చక్రను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వచ్చింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ప్రెస్ మీట్ తో మరోసారి క్లారిటీ ఇచ్చాడు విశాల్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ కు మంచి క్రేజ్ ఉండడంతో చక్ర సినిమాకు మంచి ధర పలికినట్లు తెలుస్తోంది.
తెలుగు వాళ్లలో నాకు నచ్చే విషయం
విశాల్ సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమాను నిర్మించగా MS. ఆనందన్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో విశాల్ బిజీ అయ్యాడు. అయితే తెలుగు ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడిన విశాల్.. పైరసీ గిరించి ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశాడు. తెలుగు తమిళ్ ఆడియెన్స్ తేడా గురించి చెబుతూ.. తెలుగు ఆడియెన్స్ చాలా వరకు పైరసీ వైపు వెళ్లరని, అది తనకు బాగా నచ్చుతుందని అన్నాడు.
ఇక్కడి వాళ్ళు థియేటర్స్ లోనే సినిమా చూస్తారు
నేను తమిళ్ లో ప్రెస్ మీట్ పెడితే.. తప్పకుండా అక్కడ పైరసీ గురించి మాట్లాడతాను. కానీ తెలుగులో ఒక్కసారి కూడా పైరసీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ ఆడియెన్స్ థియేటర్స్ లోనే సినిమాను ఎక్కువగా చూస్తారు. రిపీట్ ఆడియెన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. పైరసీలో చూడకుండా థియేటర్స్ లో చూడాలని చాలా బాగా సపోర్ట్ చేస్తారని విషాల్ వివరణ ఇచ్చాడు.