వైరస్, మిడతల ఎటాక్ తరువాత సూర్య మరో ఫ్యూచర్ మూవీ.. ఆ ప్రాజెక్ట్ కోసం 150కోట్లు!
టాలెంటెడ్ తమిళ్ హీరో సూర్య సెలెక్ట్ చేసుకునే కథలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలో భవిష్యత్తుకు సంబంధించిన ఎదో ఒక విషయం గురించి ఉంటుంది. సెవంత్ సెన్స్ వైరస్, బందోబస్త్ మిడతల ఎటాక్.. వంటి విషయాలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నెక్స్ట్ మరో భవిష్యత్తు టైమ్ ట్రావెల్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

హిట్టు కొట్టాలని..
సూర్యకి కోలీవుడ్ లో మార్కెట్ ఏ స్థాయిలో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పుడిపుడే వంద కోట్లను దాటుతున్నాడు. తెలుగులో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే గతంలో మాదిరిగా అయితే ఇక్కడ సక్సెస్ అందుకోవడం లేదు. దీంతో నెక్స్ట్ సరైన ప్రాజెక్టులతో హిట్టు కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

పాన్ ఇండియా కాన్సెప్ట్..?
బందోబస్త్ సినిమాతో కోలీవుడ్ లో అయితే మంచి సక్సెస్ అందుకున్నాడు. కానీ NGK అంతగా సక్సెస్ కాలేదు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సూర్య నెక్స్ట్ ఒక పాన్ ఇండియా సినిమాతో రావడానికి ట్రై చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మంచి కాన్సెప్ట్ దొరికితే పాన్ ఇండియాన్ మూవీగా రెడీ చేస్తున్నారు.

క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..
సూర్యతో దర్శకుడు విక్రమ్ కుమార్ ఇదివరకే 24 అనే సినిమా చేశాడు. ఆ సినిమా కమర్షియల్ గా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి దర్శకుడికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అయితే 24 సినిమాకు సీక్వెల్ ని సిద్ధం చేసినట్లు దర్శకుడు విక్రమ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. నాగ చైతన్యతో సినిమా చేసిన తరువాత ఆ సీక్వెల్ సెట్స్ పైకి రానున్నట్లు దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

టైమ్ ట్రావెల్ కోసం..
ఇకపోతే 24 సీక్వెల్ కథలో టైమ్ ట్రావెల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయట. భవిష్యత్తులో తప్పకుండా మనిషి కాలాన్ని గెలుస్తాడు అనే విదంగా ఆ సినిమాలో ఒక విషయాన్ని చూపిస్తారట. విజువల్ ఎఫెక్ట్స్ కూడా గట్టిగానే ఉంటాయట. అందుకు 150కోట్లకు పైగా ఖర్చు చేసే ఛాన్స్ ఉన్నట్లు అప్పుడే కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఇంతవరకు సూర్య సినిమాలు ఆ స్థాయిలో తెరకెక్కలేదు. మరి ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











