twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోకు హైకోర్టు షాక్.. ఆ విషయంలో సమాధానం చెప్పాలంటూ సమన్లు

    |

    ధనుష్ తమ కుమారుడు అంటూ తమిళనాడుకు చెందిన ఒక వృద్ధ జంట గతంలో మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కోర్టు కేసుల వరకు వెళ్లారు. తాజాగా ఈ క్రమంలో ధనుష్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ధనుష్ కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

     కోర్టులో కేసులు కూడా

    కోర్టులో కేసులు కూడా


    తమిళ దర్శకుడు కస్తూరి రాజా నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్ అనేక సంవత్సరాలు హీరోగా నిలబడడం కోసం కష్టపడు. తర్వాత ఇప్పుడు తమిళ్ లో స్టార్ హీరోల్లో ఒకరిగా నిలబడటమే కాక తన సత్తా చాటుకున్నాడు. అయితే ఆయన కస్తూరి రాజా కుమారుడు కాదని తన కుమారుడని తమకున్న ముగ్గురు సంతానంలో రెండవ వాడు అని ఒక వృద్ధ జంట కొన్నేళ్ళ క్రితం మీడియా ముందుకు రావడమే గాక కోర్టులో కేసులు కూడా వేసింది.

    మద్రాస్ హైకోర్టును

    మద్రాస్ హైకోర్టును


    తమ కుమారుడు కాబట్టి తమకు నెలకు 65 వేల రూపాయలు చెల్లించాలని వారు కోరారు. అయితే అందుకు ఒప్పుకోని ధనుష్ తాను మాత్రం కస్తూరి రాజకుమారుడినేనని. వారి కుమారుడిని కాదు కాబట్టి వాళ్లకు అరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం కరెక్ట్ కాదని ఆయన ప్రకటించారు. అయితే తాజాగా ఆ వృద్ద దంపతులు కదిరేషన్, మీనాక్షి ధనుష్ తన మూడో కుమారుడు అంటూ మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

    ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు

    ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు


    గతంలో ధనుష్ సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రాలు నకిలీవని తాము జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వద్ద దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేయడాన్ని వ్యతిరేకిస్తూ కదిరేషన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే వివరణ ఇవ్వాలని హీరోకి హై కోర్టు సమన్లు జారీ చేసింది. ఇక కదిరేషన్ సమర్పించిన ఆధారాలను బట్టి పోలీసులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సినిమాల మీద ఆసక్తితో చిన్నప్పుడే తన కుమారుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అని తర్వాత కస్తూరి కంట పడటంతో వారి ఇంట పెరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు..

    చర్చనీయాంశమై

    చర్చనీయాంశమై


    ఇక లేజర్ ట్రీట్మెంట్ ద్వారా శరీరం మీద ఉన్న పుట్టు మచ్చలను కూడా చనిపోయాడు అని అలా ఏదైనా జరిగి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఇక ధనుష్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వారి వివాహం జరిగిన 17 సంవత్సరాల తరువాత తాను ఇక కలిసి ఉండలేమని స్నేహితులుగా ఉంటామని భార్యా భర్తలుగా విదిపోతున్నామని అంటూ అధికారిక ప్రకటన చేశారు. ఇక అప్పట్లో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

    విడాకులు

    విడాకులు


    కస్తూరి రాజా రజనీకాంత్ వంటి వారు వీరి వివాహ బంధాన్ని మళ్లీ ఒకటి చేయాలని ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ అది మాత్రం నిజం కాలేదు. మొత్తం మీద ధనుష్ తల్లిదండ్రులు అంటూ మరోసారి వృద్ధ జంట వార్తలు రావడంతో ధనుష్ కి కొత్త టెన్షన్ మొదలైంది అని చెప్పాలి. ఆయన చివరిగా ద్వారా తన సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఆ సినిమా అయితే పెద్దగా ఆకట్టుకోలేదు.. ప్రస్తుతం ధనుష్ పలు సినిమాల షూటింగ్లలో బిజీగా ఉన్నారు.

    English summary
    Madras High Court summons Dhanush in a case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X