Don't Miss!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- News పవన్ కళ్యాణ్ ఊపిరితిత్తుల్లో నిమ్ము- అభిమానులకు జనసేన కీలక సూచన..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆ టాలెంటెడ్ హీరో కోసం భారీగా ఖర్చు పెడుతున్న మహేష్.. ఒకేసారి 500మందితో..
సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతంగా GMB ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు తనకు కీలకమైన ప్రతి సినిమాకు ఈ సంస్థను కలుపుతూ వస్తున్న మహేష్ నిర్మాతపై రెమ్యునరేషన్ భారం పడకుండా షేర్స్ అందుకుంటున్నాడు. ఇక అదే సంస్థను ప్రొడక్షన్ హౌజ్ గా కూడా మార్చేసిన మహేష్ బయట హీరోలతో కూడా సినిమా చేయాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే.
రిస్క్ చేయడం ఎందుకని
శ్రీమంతుడు సినిమా నుంచి కూడా మహేష్ GMB బ్యానర్ ను విజయవంతంగా నడుపుతూ వస్తున్నాడు. ఆ మధ్య సొంతంగానే కొన్ని సినిమాలను నిర్మించాలని అనుకున్నాడు. కానీ రిస్క్ చేయడం ఎందుకని ఆ బాధ్యతను నెత్తిపైన వేసుకోలేదు. ఇక చిన్న బడ్జెట్ లో సేఫ్టీగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడానికి రెడీ అయ్యాడు. ఆ బాధ్యతను నమ్రత చేతుల్లో పెట్టేశాడు.
మేజర్ సినిమాతో
ఇక నెక్స్ట్ మేజర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి సారి GMB లో మహేష్ తరువాత బయట హీరో చేస్తున్న సినిమా ఇదే. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతోంది. శశి కిరణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.
అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే
ఇక ఈ సినిమాకు కో ప్రొడక్షన్ గా సోని పిక్చర్స్ ఉన్నప్పటికీ ఎక్కువ భాగం GMB ప్రొడక్షన్ వారే ఖర్చు చేస్తున్నారట. సినిమా కథ నచ్చడంతో మేకింగ్ విషయంలో ఏ మాత్రం అడ్డు చెప్పడం లేదట. బడ్జెట్ అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో కీలకమైన సెట్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.
Recommended Video
దాదాపు 500 మందితో
ముందుగా సినిమా కథలో ముంబై తాజ్ హోటల్ కీలకమైనది కాబట్టి దానికోసం కీలకమైన భాగాలను మూడు రకాల సెట్స్ రూపంలో నిర్మించారట. దాదాపు 500 మంది కష్టపడ్డారట. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా మహేష్ సలహాతో అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక మహేష్ కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జూలై 2న ఈ సినిమాను విడుదల చేయాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.