twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mahesh Babu రాజమౌళి మూవీ తరువాత ఆ దర్శకుడితోనే.. ఎన్టీఆర్ బాటలోనే..

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి పూర్తిస్థాయిలో టార్గెట్ ను అందుకోలేకపోయింది. కానీ నిర్మాతలు మాత్రం పెద్దగా నష్టాలు రాలేదనే చెప్పాలి. ఇక మహేష్ బాబు 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

    అయితే ఈ ప్రాజెక్టు అనంతరం తన 28వ సినిమాను దర్శకత్వంలో చేయనున్న మహేష్ బాబు ఆ తర్వాత దర్శకులను కూడా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక పోలికతో మహేష్ ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి

    కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి

    మహేష్ బాబు పరశురామ్ కలయికలో వచ్చిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ బాగానే అందుకున్నప్పటికి ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. దీంతో చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ కు పెట్టిన పెట్టుబడి వెనక్కి రాలేకపోయింది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని అనుకుంటే మొదటి వారం తర్వాత తీవ్రంగా నిరాశ పరిచింది.

    త్రివిక్రమ్ సినిమాకు హై డిమాండ్

    త్రివిక్రమ్ సినిమాకు హై డిమాండ్

    సర్కారు వారి పాట పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా మహేష్ తదుపరి సినిమాపై ప్రభావం ఏమాత్రం చూపించడం లేదు అని తెలుస్తోంది. మహేష్ తన 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 300 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని డీల్స్ పై అగ్రిమెంట్స్ జరుగుతున్నట్లు సమాచారం.

    మైత్రితోనే 30వ సినిమా

    మైత్రితోనే 30వ సినిమా

    మరో వైపు మహేష్ బాబు రాజమౌళితో తన 29వ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తప్పకుండా మహేష్ బాబు ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా సినిమాలను లైన్ లో పెట్టడం ఖాయమని కూడా అర్థం అవుతోంది. ఎందుకంటే ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ మహేష్ తదుపరి సినిమా కోసం అగ్రిమెంట్ కూడా చేసుకుంది. అందుకోసం 50 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చింది.

    మరోసారి మహేష్ కొరటాల కాంబో..

    మరోసారి మహేష్ కొరటాల కాంబో..

    మహేష్ బాబు 30వ సినిమాకు దర్శకుడు కూడా ఫిక్స్ అయ్యాడు. నిన్నటి వరకు దర్శకుడు ఎవరు అనే విషయం లో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ మహేష్ బాబు 30 వ సినిమా కోసం కొరటాల శివ ను ఫిక్స్ చేసుకుంది. రీసెంట్ గా కథకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయినట్లు సమాచారం.

    ఎన్టీఆర్ తరహాలోనే..

    ఎన్టీఆర్ తరహాలోనే..

    ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే మహేష్ బాబు లైనప్ చూస్తుంటే ఎన్టీఆర్ తో సమానంగా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేశాడు. ఆ తర్వాత 29వ సినిమా RRR ను రాజమౌళి దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే. ఇక 30వ సినిమాను ప్రస్తుతం కొరటాల శివ తో చేస్తున్నాడు. ఇదే తరహాలో మహేష్ బాబు ఎన్టీఆర్ దర్శకులను కంటిన్యూ చేస్తూ ఉండడం విశేషం.

    English summary
    Mahesh babu continue with NTR directors with same lineup numbers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X