Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ మృతి తరువాత తొలిసారిగా స్పందించిన మహేష్.. ఎమోషనల్ నోట్ వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయినా సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాత ఇతర అవయవాలు కూడా చికిత్సకు సహకరించకపోవడంతో నవంబర్ 15వ తేదీన తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ ఘటన ఘట్టమనేని ఫ్యామిలీలో ఒక్కసారిగా అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక మహేష్ బాబు మొదటిసారిగా సోషల్ మీడియాలో తన తండ్రి గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..
శోకసంద్రంలో..
సూపర్ స్టార్ కృష్ణ ఎలాగైనా మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి రావాలి అని ఆయన హాస్పిటల్లో ఉన్న రోజు కూడా అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రాణాలు కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో కేవలం ఘట్టమనేని ఫ్యామిలీ మాత్రమే కాకుండా ఆయన అభిమానులు కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.
ఆచారాల ప్రకారం..
ఇక ఘట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని చాలామంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకున్నారు. ఇక ఇటీవల మహేష్ బాబు కూడా తన తండ్రి కర్మకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఆచారాల ప్రకారం మహేష్ బాబు అంత్యక్రియలను పూర్తి చేసిన ఫోటోలు కూడా అభిమానులను కంటతడి పెట్టించాయి.
వరుస విషాధాలు
ఒకే ఏడాదిలో మహేష్ బాబు తన ముగ్గురు అతి ముఖ్యమైన కుటుంబ సభ్యులను కోల్పోవడం తీవ్ర శోకసంద్రంలో ముంచి వేసింది. ఈ ఏడాది మొదట్లోనే ఆయన సోదరుడు రమేష్ బాబు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక రెండు నెలల క్రితం ఆయన మాతృమూర్తి ఇందిరాదేవి కూడా కన్నుమూశారు. ఇక ఇప్పుడు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా కన్నుమూయడంతో మహేష్ బాబు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు.
— Mahesh Babu (urstrulyMahesh) November 24, 2022 |
మహేష్ ఎమోషనల్ పోస్ట్
అయితే మహేష్ బాబు మొదటిసారి తన తండ్రిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశాడు.. మీ జీవితం ఒక సెలబ్రేషన్. మీరు ఒక గొప్ప వ్యక్తిగా వెలుగొందరు ఎంతో నిర్భయంగా జీవితాన్ని గడిపారు. ధైర్యం చురుకుదనం మీ స్ఫూర్తి నాకు కూడా ఎంత స్ఫూర్తిగా నిలిచాయి. అవే నా ధైర్యం. మీలో ఎన్నో మంచి విషయాలను నేను చూసుకున్నాను, నేర్చుకున్నాను.. అని మహేష్ అన్నారు.
లవ్ యూ నాన్నా..
అలాగే.. విచిత్రమేమిటంటే, నేను ఇంతకు ముందెన్నడూ అనుభవించని ఈ బలాన్ని నాలో అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది.. మీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాను. మీరు మరింత గర్వపడే విధంగా వెళతాను. లవ్ యూ నాన్నా.. మీరే నా సూపర్ స్టార్.
అంటూ మహేష్ ఎమోషనల్ గా తెలియజేశారు.