Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
త్రివిక్రమ్ సినిమా కంటే ముందు మరో షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. ఇది మూడోసారి?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత వెంటనే మరొక సినిమాను మొదలు పెట్టాలని చర్చలు బాగానే జరిపాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గత కొన్నేళ్లుగా మూడో సినిమా చేయాలి అని అనుకుంటున్న మహేష్ బాబు ఇంతవరకు ఆ ప్రాజెక్టును మొదలు పెట్టలేదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ బాబు ఒప్పుకునే వరకు కథలో ఎన్నో మార్పులు కూడా చేశాడు.
ఫైనల్ గా ఇటీవల మహేష్ ఫైనల్ స్క్రిప్ట్ పై సంతృప్తి చెందడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా ఆగస్టు నెలలోనే సినిమా షూటింగ్ ను మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐతే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. అసలైతే ఈ ఏడాది మొదట్లోనే మహేష్ బాబు ఆ సినిమాను మొదలు పెట్టాలి అని అనుకున్నారు.
కానీ సూపర్ స్టార్ మాత్రం ప్రత్యేకంగా కుటుంబ సభ్యులుగా కలిసి కొన్ని హాలిడే వెకేషన్ కు వెళ్లారు. అప్పటికి మహేష్ ఇంకా త్రివిక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో అసలు సినిమా ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ త్రివిక్రమ్ పట్టు విడవకుండా మహేష్ బాబు ఎక్కడికి వెళ్లినా కూడా కథను చెప్పడానికి వెళ్ళాడు. ఒకసారి దుబాయ్ లో ఉన్నప్పుడు మరోసారి అమెరికాలో ఉన్నప్పుడు కూడా త్రివిక్రమ్ మహేష్ దగ్గరకు వెళ్లి మరి ఒప్పించాడు.
ఇక రాబోయే రోజుల్లో మరింత బిజీగా ఉండాలి కాబట్టి మహేష్ బాబు ఇప్పుడే ఫ్యామిలీతో కాస్త ఎక్కువగా టైం స్పెండ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా మహేష్ మరోసారి తన భార్య పిల్లలతో కలిసి లండన్ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అక్కడే ఒక వారం పాటు ఉండబోతున్న మహేష్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటి షెడ్యూల్లో పాల్గొనబోతున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసింది. ఆ సినిమాకు మహేష్ దాదాపు రెండేళ్ల వరకు కష్టపడాల్సి ఉంటుంది.