Don't Miss!
- News అభ్యర్దుల మార్పు పై చంద్రబాబు కీలక నిర్ణయం - ఆ నేతలకు పిలుపు..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
పదేళ్ల తరువాత మహేష్ బాబు సినిమాపై ఎఫెక్ట్.. అప్పుడు ఖలేజా.. ఇప్పుడు SVP!
సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా వరకు సేఫ్ జోన్ లోనే హిట్స్ కొట్టడానికి ట్రై చేస్తుంటారని అందరికి తెలిసిన విషయమే. ఇక తన కెరీర్ లో ప్లాప్స్ వస్తే ఏ మాత్రం తట్టుకోలేనని మహేష్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇక కెరీర్ లో కొన్ని అపజయాల కారణంగా ఈ హీరో చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఇకపోతే చాలా రోజుల తరువాత అనుకోని విదంగా మహేష్ వెండితెరకు చాలా గ్యాప్ ఇవ్వాల్సి వస్తోంది.
ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న మహేష్ బాబు నెక్స్ట్ సినిమాతో కూడా మంచి హిట్ అందుకోవాలని స్పీడ్ గా షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకున్నాడు. డైరెక్టర్ పరశురామ్ తో సర్కారు వారి పాట (SVP) అనే సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా స్టార్ట్ కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇక సినిమా వెండితెరపైకి రావడానికి మరో ఏడాది సమయం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అంటే మహేష్ బాబు కెరీర్ లో మరో లాంగెస్ట్ బ్రేక్ ఇదే. 2007లో భారీ అంచనాలతో విడుదలైన అతిధి సినిమా ప్లాప్ కావడంతో మహేష్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. అనుకోని విధంగా ఆ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ 2010లో ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. ఇక ఆ తరువాత మళ్ళీ మహేష్ ఏడాది గ్యాప్ కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా SVP సినిమాకు బ్రేక్ తీసుకోక తప్పడం లేదు.