twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమా విషయంలో మహేశ్ యూటర్న్: రాజమౌళి కంటే ముందే ఎంట్రీ ఇచ్చేలా వ్యూహం!

    By Manoj
    |

    'రాజకుమారుడు' సినిమాతో హీరోగా పరిచయమై... ఎంతో మంది అమ్మాయిల గుండెల్లో నిజమైన రాకుమారుడిగా మారిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన టాలెంట్‌తో టాలీవుడ్‌లోని స్టార్ హీరోలలో ఒకడిగా వెలుగొందుతున్నాడు. హిట్‌తో పొంగిపోకుండా... ఫ్లాఫ్‌ వచ్చినప్పుడు క్రుంగిపోకుండా ముందడుగు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన సాహసోపేత నిర్ణయాలతో సూపర్ సక్సెస్ అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన కొత్త సినిమా విషయంలో మహేశ్ యూటర్న్ తీసుకున్నాడట. దీనికి కారణం రాజమౌళి కంటే ముందే ఎంట్రీ ఇవ్వాలనుకోవడమే అని తెలుస్తోంది. అసలేం జరిగింది.? వివరాల్లోకి వెళితే...

     హ్యాట్రిక్ విజయాలతో మహేశ్ దూకుడు

    హ్యాట్రిక్ విజయాలతో మహేశ్ దూకుడు

    కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ దూకుడును ప్రదర్శిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను'తో భారీ హిట్‌ను అందుకున్న అతడు.. ఆ తర్వాత వంశీ పైడిపల్లి తీసిన ‘మహర్షి'తో మరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక, ఈ మధ్య అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

     రికార్డులు బద్దలు... ఫుల్ జోష్‌తో ప్రిన్స్

    రికార్డులు బద్దలు... ఫుల్ జోష్‌తో ప్రిన్స్

    సంక్రాంతికి రిలీజ్ అయిన ‘సరిలేరు నీకెవ్వరు' విజయంతో మహేశ్ బాబు ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ మూవీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఇక, ఇటీవల బర్త్‌డే ట్రెండ్ విషయంలోనూ సూపర్ స్టార్ ఖాతాలో అరుదైన రికార్డులు వచ్చి చేరాయి. దీంతో ఈ హ్యాండ్సమ్ హీరో ఫుల్ ఖుషీగా ఉన్నాడు.

    వాళ్లను టార్గెట్ చేయడానికి సరికొత్తగా

    వాళ్లను టార్గెట్ చేయడానికి సరికొత్తగా

    వరుస హిట్లతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు... ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్‌టైనర్స్‌తో కలిసి మహేశ్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీలో బ్యాంకులను మోసం చేస్తున్న బడా బాబులను టార్గెట్ చేయబోతున్నారని టాక్.

    ఎవరూ ఊహించని సర్‌ప్రైజింగ్ లుక్‌తో

    ఎవరూ ఊహించని సర్‌ప్రైజింగ్ లుక్‌తో

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడని అంటున్నారు. అంతేకాదు, ఈ మూవీ కోసం అతడు ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ‘సర్కారు వారి పాట' కోసం అతడు సిక్స్ ప్యాక్‌తో దర్శనమిచ్చేందుకు కష్ట పడుతున్నాడనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

     సినిమా విషయంలో మహేశ్ యూటర్న్

    సినిమా విషయంలో మహేశ్ యూటర్న్

    కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట' విషయంలో మహేశ్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. తెలుగులో మాత్రమే తీయాలని భావించిన ఈ సినిమాను.. ప్యాన్ ఇండియా రేంజ్‌కు పెంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని మార్పులు కూడా చేస్తున్నారని సమచారం.

    Recommended Video

    #SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu
    రాజమౌళి కంటే ముందే ఎంట్రీ ఇచ్చేలా

    రాజమౌళి కంటే ముందే ఎంట్రీ ఇచ్చేలా

    ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో ప్రాజెక్టు చేయనున్నాడు. ఇది ప్యాన్ ఇండియా రేంజ్‌తో తెరకెక్కనుంది. ఈలోపు ఉత్తరాది వాళ్లకు పరిచయం అయ్యేందుకే ‘సర్కారు వారి పాట'ను హిందీలోనూ తీస్తున్నారని తెలుస్తోంది. యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు, ఈ మూవీ కోసం బాలీవుడ్ ప్రముఖులనూ తీసుకుంటున్నారట.

    English summary
    Mahesh Babu is an Indian film actor, producer, media personality, and philanthropist known for his works in Telugu cinema. He owns the production house G. Mahesh Babu Entertainment Pvt. Ltd. The younger son of veteran Telugu actor Krishna, Mahesh made his cameo as a child artist in Needa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X