Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
Mahesh Babu Surgery: అసలు మహేశ్ బాబుకు ఏమైంది? ఇంత సడెన్గా సర్జరీ ఎందుకు? పూర్తి వివరాలివే
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్గా ఎదిగిపోయాడు హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు. ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. మార్కెట్ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అదే సమయంలో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సైతం అందుకున్నాడు. ఇలా దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్లో హవాను చూపిస్తూ వస్తున్నాడు.
కొంత కాలంగా ఫుల్ ఫామ్తో కనిపిస్తోన్న మహేశ్.. ఇప్పుడు వరుస చిత్రాలతో దూకుడు చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు సర్జరీ చేయించుకోడానికి అమెరికా వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అసలేం జరిగింది? ఇప్పుడే ఎందుకు సర్జరీ చేయించుకుంటున్నాడు? ఆ పూర్తి వివరాలు మీకోసం!
వరుసగా మూడు హిట్లు కొట్టేశాడుగా
కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కొరటాల శివ తీసిన 'భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 'మహర్షి', అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. వీటితో హ్యాట్రిక్ను అందుకున్న అతడు.. రికార్డులను కూడా క్రియేట్ చేసి మార్కెట్ను విస్తృతం చేశాడు.
Bigg Boss: తొండాటతో అడ్డంగా బుక్కైపోయిన సన్నీ.. టాప్ కంటెస్టెంట్ ఇలా చేశాడంటే నమ్మలేరు
సర్కారు వారి పాట అంటున్న స్టార్
ప్రస్తుతం మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్లో రిలీజ్ కానుంది.
మాటల మాంత్రికుడితో మూడోసారి
'సర్కారు వారి పాట' సినిమా పట్టాలపై ఉండగానే మహేశ్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు.
బ్రా కూడా లేని వీడియోతో షాకిచ్చిన పాయల్ రాజ్పుత్: ప్రైవేటు పార్టులు చూపిస్తూ దారుణంగా!
మహేశ్ బాబు మోకాలికి సర్జరీ అని
కొన్నేళ్లుగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న మహేశ్ బాబు.. కొంత కాలంగా మోకాలు సంబంధిత సమస్యతో బాధ పడుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సర్జరీ చేయించుకునేందుకు గానూ ఈ స్టార్ హీరో అమెరికా వెళ్లబోతున్నాడు. అక్కడే దాదాపు 20 రోజుల పాటు ఉండనున్నాడని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే అతడు ఫ్లైట్ ఎక్కేస్తాడట.
అసలు మహేశ్ బాబుకు ఏమైంది?
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఏడేళ్ల క్రితం షూటింగ్ చేస్తోన్న సమయంలో మోకాలికి గాయం అయింది. అప్పటి నుంచి అతడు దీని వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఓ సందర్భంలో అమెరికాలో పరీక్షలు చేయించుకోగా.. సర్జరీ అవసరం ఉంటుందని అక్కడి వైద్యులు తెలిపారు. వాళ్ల సూచన మేరకే ఇప్పుడు మహేశ్ బాబు శస్త్రచికిత్స చేయించుకోడానికి వెళ్తున్నాడు.
ప్యాంట్ లేకుండా షాకిచ్చిన అనన్య నాగళ్ల: సినిమాల్లో నిండుగా.. ఇక్కడ మాత్రం అరాచకంగా!
ఇప్పుడే చేయించడానికి కారణం
వాస్తవానికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలైన తర్వాత మహేశ్ బాబు అమెరికాలో సర్జరీ చేయించుకోవాలని భావించాడు. కానీ, కరోనా విజృంభణ వల్ల అప్పుడు సాధ్యపడలేదు. అయితే, ఇటీవల 'సర్కారు వారి పాట' షూట్ చేస్తోన్న సమయంలో అతడికి సమస్య ఎక్కువైందట. దీంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిసింది.
Recommended Video
ఇది వాయిదా.. అది ఆలస్యంగానే
ఇప్పుడు మహేశ్ బాబు సర్జరీ చేయించుకుంటే రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందట. దీనివల్ల 'సర్కారు వారి పాట' మూవీ షూటింగ్కు అప్పటి వరకూ బ్రేక్ పడే అవకాశం ఉంది. అంతేకాదు, త్రివిక్రమ్తో ప్రారంభం కావాల్సి ఉన్న సినిమా కూడా మరింత ఆలస్యం అవొచ్చు. ఇక, మహేశ్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ అప్పుడే ట్వీట్లు చేస్తున్నారు.