Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మిలటరీ అధికారిగా మహేష్.. ఆ అంశాలని హైలైట్ చేస్తూ సినిమా!
మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అనిల్ వినిపించిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సిద్ధం చేసిన కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ చిత్రంలో మహేష్ బాబు మిలటరీ అధికారిగా కనిపిస్తాడని అంటున్నారు. మహేష్ పాత్రలో ఎక్కువగా దేశభక్తి కనిపిస్తుందట. సెలవుల్లో తన సొంత ఊరికి వచ్చిన మిలటరీ అధికారి కథగా అనిల్ రావిపూడి ఈ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. దేశభక్తితో పాటు, హాస్యాన్ని అనిల్ రావిపూడి ఈ చిత్రంలో హైలైట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మహర్షి ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే అనిల్ రావిపూడి చిత్రాన్ని మహేష్ పట్టాలెక్కించనున్నాడు. అనిల్ రావిపూడి చిత్రంలో మహేష్ కు జోడిగా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటించే అవకాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.