మిలటరీ అధికారిగా మహేష్.. ఆ అంశాలని హైలైట్ చేస్తూ సినిమా!
మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నారు. ఎఫ్2 చిత్రంతో బంపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మహేష్ బాబుతో ఓ చిత్రం చేయబోతున్నాడు. అనిల్ వినిపించిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి కథకు తుదిమెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి సిద్ధం చేసిన కథకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ చిత్రంలో మహేష్ బాబు మిలటరీ అధికారిగా కనిపిస్తాడని అంటున్నారు. మహేష్ పాత్రలో ఎక్కువగా దేశభక్తి కనిపిస్తుందట. సెలవుల్లో తన సొంత ఊరికి వచ్చిన మిలటరీ అధికారి కథగా అనిల్ రావిపూడి ఈ చిత్రం తెరకెక్కించబోతున్నాడు. దేశభక్తితో పాటు, హాస్యాన్ని అనిల్ రావిపూడి ఈ చిత్రంలో హైలైట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మహర్షి ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే అనిల్ రావిపూడి చిత్రాన్ని మహేష్ పట్టాలెక్కించనున్నాడు. అనిల్ రావిపూడి చిత్రంలో మహేష్ కు జోడిగా క్రేజీ హీరోయిన్ రష్మిక మందన నటించే అవకాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











