Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
కొత్త సినిమా కోసం మహేశ్ డేరింగ్ స్టెప్: సెంటిమెంట్ పక్కన పెట్టి.. కెరీర్లో తొలిసారి అక్కడ షూటింగ్
కొంత కాలంగా వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ ఫామ్లో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీంతో తన స్టామినాను బాక్సాఫీస్కు రుచి చూపిస్తున్నాడు. అదే సమయంలో మార్కెట్ను గణనీయంగా పెంచుకుంటున్నాడు. అలాగే, వరుసగా మరిన్ని సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో కీలక నిర్ణయాలను సైతం తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే మహేశ్ బాబు తన కొత్త సినిమా కోసం కెరీర్లోనే తొలిసారి ఓ ప్రాంతానికి వెళ్లబోతున్నాడట. అసలేంటా మేటర్? పూర్తి వివరాలు మీ అందరి కోసం!
సర్కారు వారి పాట అంటూ వస్తున్నాడు
వరుస విజయాలతో దూసుకుపోతోన్న మహేశ్ బాబు.. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. దీనికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది.
వరుస ఆటంకాలు.. షూటింగ్కు ఆలస్యం
'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మహేశ్ బాబు.. వంశీ పైడిపల్లితో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా పరశురాంతో ప్రాజెక్టును ప్రకటించాడు. కానీ, ఆ వెంటనే లాక్డౌన్ వల్ల షూటింగ్ మొదలవలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆరంభంలో ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం అయింది. ఆ వెంటనే కరోనా రెండో దశ వల్ల మళ్లీ బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ చాలా ఆలస్యమైంది.
సినిమా నేపథ్యం ఇదే... సందేశాత్మకంగా
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సర్కారు వారి పాట'ను బ్యాంకులను మోసం చేసి పరారవుతోన్న వాళ్లను టార్గెట్ చేస్తూ సందేశాత్మకంగా రూపొందిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. దీంతో ఆ ఉద్యోగికి బ్యాడ్ నేమ్ వస్తుంది. అప్పుడు అతడి కొడుకైన హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్ను ఎలా పట్టించాడనేదే ఈ మూవీ కథ.
రెండో షెడ్యూల్కు ముహూర్తం ఖరారైంది
వాస్తవానికి 'సర్కారు వారి పాట' షూటింగ్ రెండో షెడ్యూల్ను విదేశాల్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితుల వల్ల భారతీయులకు ఆయా దేశాల్లో ప్రవేశం లేదు. దీంతో ఈ మూవీ షూటింగ్లో మార్పులు చేసి ఇక్కడే చిత్రీకరణ జరపాలని డిసైడ్ అయ్యారు. ఇక, ఈ సినిమా షూటింగ్ జూలై 12 నుంచి పున: ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. దీని తర్వాత ఫారిన్ షెడ్యూల్ ఉంటుందట.
కొత్త సినిమా కోసం మహేశ్ డేరింగ్ స్టెప్
12న ప్రారంభం కాబోతున్న షెడ్యూల్ను విశాఖపట్నంలో ప్లాన్ చేశాడట దర్శకుడు పరశురాం. ఆ ఏరియాలోని కొన్ని ప్రాంతాల్లో హీరో, హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. అలాగే, అక్కడే ఓ యాక్షన్ సీన్ను కూడా షూట్ చేస్తారని అంటున్నారు. ఇదంతా జరగడానికి ముందే మహేశ్ బాబు ఓ డేరింగ్ స్టెప్ వేశాడని ఒక న్యూస్ తాజాగా బయటకు వచ్చింది.
Recommended Video
సెంటిమెంట్ను పక్కన పెట్టేసి.. తొలిసారి
ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే, ఒక్కటంటే ఒక్క సినిమా షూటింగ్ కోసం కూడా విశాఖపట్నం వెళ్లలేదట. అది అతడి సెంటిమెంటేమోనన్న టాక్ కూడా ఇండస్ట్రీలో ఉందట. ఈ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' కోసం మాత్రం తొలిసారి విశాఖ గడ్డపై అతడు అడుగు పెడుతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు, అక్కడ 20 రోజులు ఉంటున్నాడట.