Don't Miss!
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Sports IPL చరిత్రలో తొలిసారి.. రాహుల్-రుతురాజ్కు షాక్!
- News Rk Roja Margadarsi Chit: మార్గదర్శిలో రోజాకు చిట్! విలువెంతో తెలుసా?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ప్రభాస్ దర్శకుడిని కూడా లైన్ లో పెడుతున్న మహేష్.. రాజమౌళి తరువాత మరో పాన్ ఇండియా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమా తో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే విధంగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.. కమర్షియల్ గా ఈ సినిమా నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి కి మంచి లాభాలను అందించింది. అయితే కొన్ని ఏరియాల్లో మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ కొంత నష్టాలను చూడాల్సి వచ్చింది. ఏదేమైనా కూడా సర్కారు వారి పాట సినిమాతో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న మహేష్ బాబు మరోసారి తన స్టార్ ఇమేజ్ ఏమిటో నిరూపించుకున్నాడు. అయితే రీసెంట్గా మహేష్ బాబు ప్రభాస్ తో సినిమాను సెట్ చేసుకున్న దర్శకుడుని కూడా లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది ఆ వివరాల్లోకి వెళితే..
అంచనాలకు తగ్గట్టుగా..
సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేష్, త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు అయితే మామూలుగా లేవు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని ప్రేక్షకులలో ఒక బలమైన నమ్మకం అయితే ఉంది. త్రివిక్రమ్ కూడా ఈ సినిమాను పూర్తి స్థాయిలో యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
మహేష్ టార్గెట్
అసలైతే ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి లోపు పూర్తి చేసి మళ్ళీ వెంటనే రాజమౌళి దర్శకత్వంలో కొత్త సినిమాలు మొదలుపెట్టాలి అని మహేష్ బాబు టార్గెట్ సెట్ చేసుకుంటున్నాడు.
2023లో స్టార్ట్
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా షూటింగ్ 2023 జనవరి అనంతరం మొదలవుతుందట. ఇక సినిమా కోసం దాదాపు ఈడాది వరకు మహేష్ బాబు షూటింగ్లో పాల్గొననున్నాడు. ఇక 2024లో ఆ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ థియేటర్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ సినిమా ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో తెరకెక్కుతుందని ఇదివరకే రచయితకే విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి కథా చర్చల్లో చాలా బిజీగా ఉన్నాడు.
ముందుజాగ్రత్త
అయితే రాజమౌళి చేయబోయే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తప్పకుండా సక్సెస్ అవుతుందని మహేష్ బాబులో గట్టి నమ్మకమే ఉంది. ఇక ఆ తర్వాత చేయబోయే సినిమా కూడా అంతకు మించి అనేలా ఇలా ఉండాలి అని మహేష్ బాబు దర్శకులను ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. లిస్టులో సుకుమార్, కొరటాల శివ పేర్లు కూడా ఉన్నాయి కానీ ఇంకా ఎవరి పేర్లు ఫైనల్ కాలేదు.
ప్రభాస్ దర్శకుడితో?
ఇటీవల మహేష్ యంగ్ డైనమిక్ సందీప్ రెడ్డి వంగాను సంప్రదించినట్లు సమాచారం. ఈ దర్శకుడు ఎనిమల్ సినిమా అనంతరం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరి మధ్యలో కొన్ని చర్చలు కొనసాగాయి. మరి ఈ కాంబో పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.